Chandrababu – Nitish Kumar Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ( Chandrababu ) టీమిండియా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar Reddy ) కలవడం జరిగింది. కాసేపటి క్రితమే చంద్రబాబు సీఎం క్యాంప్ ఆఫీస్ కు టీమిండియా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి కుటుంబం.. వెళ్ళింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుతో నితీష్ కుమార్ రెడ్డి అలాగే ఆయన తండ్రి ముత్యాల రెడ్డి సమావేశం అయ్యారు. సీఎం చంద్రబాబు ( Chandrababu ) ఆదేశాల మేరకే… ఇవాళ నితీష్ కుమార్ రెడ్డి, ముత్యాల రెడ్డి ( Muthyala Reddy ) సీఎం క్యాంప్ ఆఫీస్ కు వెళ్లడం జరిగింది.
Also Read: Mumbai Cricket Association: వాంఖడే స్టేడియానికి 50 ఏళ్లు.. గ్రౌండ్ స్టాఫ్ కి MCA అదిరిపోయే గిఫ్ట్స్
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఈ సమావేశంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ( Andhra Cricket Association ) సభ్యులు కూడా పాల్గొన్నారు. ఇందులో కేశినేని చిన్ని కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీమిండియా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డికి ( Nitish Kumar Reddy ) చెక్కు అందజేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ సాధించిన తర్వాత… ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ 25 లక్షల రూపాయలను ( 25 Lakh cheque ) నితీష్ కుమార్ రెడ్డికి… ప్రకటించింది.
అయితే ఆ 25 లక్షల చెక్ ను సీఎం చంద్రబాబు నాయుడు.. చేతుల మీదుగా నితీష్ కుమార్ రెడ్డి అందుకోవడం జరిగింది. ముత్యాల రెడ్డి అలాగే నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరికీ కలిపి ఆ చెక్ ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read: Virat Kohli House: కోహ్లీ కొత్త ఇల్లు ఇదే..32 కోట్లతో రెడీ.. గృహ ప్రవేశం ఎప్పుడంటే ?
ఇది ఇలా ఉండగా… మొన్న ఆస్ట్రేలియా.. టూర్ లో అదరగొట్టిన నితీష్ కుమార్ రెడ్డి… ప్రస్తుతం విశాఖ లోని తన ఇంటి వద్దే ఉంటున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవల.. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా మోకాళ్ళపై నడిచి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నితీష్ కుమార్. దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా నితీష్ కుమార్ రెడ్డి షేర్ చేశారు. ఇక.. ఆ తర్వాత… సంక్రాంతి పండుగ నేపథ్యంలో.. కోడి పందాలు నిర్వహిస్తున్న భీమవరానికి వెళ్ళాడు నితీష్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా సాధారణ పౌరుడి లాగానే… వాళ్లతో కలిసి కోడిపందాలను వీక్షించాడు నితీష్ కుమార్ రెడ్డి. ఇక లేటెస్ట్ గా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను కూడా నితీష్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ కలిసింది.
సీఎం చంద్రబాబును కలిసిన నితీష్ కుమార్ రెడ్డి
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన నితీష్ కుమార్ రెడ్డి, నితీష్ తండ్రి ముత్యాల రెడ్డి
నితీష్ సెంచరీ సాధించిన తర్వాత ACA ప్రకటించిన రూ.25 లక్షల చెక్కును నితీశ్ కుమార్ రెడ్డికి అందజేసిన సీఎం… pic.twitter.com/dtfrWBpvEA
— BIG TV Breaking News (@bigtvtelugu) January 16, 2025