BigTV English
Advertisement

Pro Kabaddi Final: ప్రో క‌బడ్డీ ఛాంపియ‌న్ గా ద‌బాంగ్ ఢిల్లీ…ఫ్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?

Pro Kabaddi Final:  ప్రో క‌బడ్డీ ఛాంపియ‌న్ గా ద‌బాంగ్ ఢిల్లీ…ఫ్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?

Pro Kabaddi Final : ప్రో కబడ్డీ 2025 టోర్నమెంట్ ( Pro Kabaddi  2025) ఛాంపియ‌న్ గా దబాంగ్ ఢిల్లీ కేసీ ( Dabang Delhi K.C.) నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో పుణేరి పల్టాన్ జట్టుపై దబాంగ్ ఢిల్లీ అదిరిపోయే విక్టరీ అందుకుని చాంపియన్ గా నిలిచింది. ఫైనల్ లో 31-28  పాయింట్ల తేడాతో పుణేరి పల్టాన్ ( Puneri Paltan) జట్టును చిత్తు చేసింది దబాంగ్ ఢిల్లీ. ఇక అటు ఫైన‌ల్స్ ఓడిన పుణేరి పల్టాన్ జట్టు ర‌న్న‌ర‌ప్ గా నిలిచింది. దీంతో ప్రో కబడ్డీ టోర్నమెంట్ లో రెండోసారి ఛాంపియన్ గా నిలిచింది దబాంగ్ ఢిల్లీ. దీంతో సంబరాలు అంబరాన్ని ఉంటాయి.


Also Read: Renuka Singh Thakur: టీమిండియా లేడీ క్రికెట‌ర్ ను అవ‌మానించిన పాకిస్తాన్‌..ఫాస్ట్ బౌలర్ కాదంటూ ట్రోలింగ్‌

ప్రో క‌బడ్డీ ఛాంపియ‌న్ గా ద‌బాంగ్ ఢిల్లీ

ప్రో కబడ్డీ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ దబాంగ్ ఢిల్లీ కేసి వర్సెస్ పుణేరి పల్టన్ జట్ల మధ్య జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ ఢిల్లీలోని త్యాగరాజు ఇండోర్ స్టేడియంలో ( Thyagaraju Indoor Stadium) ఫైనల్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ లో 31-28 తేడాతో పుణేరి పల్టాన్ జట్టును దారుణంగా ఓడించింది దబాంగ్ ఢిల్లీ కేసి. దీంతో రెండోసారి ప్రో కబడ్డీ లీగ్ టోర్నమెంట్ లో ఛాంపియన్ గా నిలిచింది. 2021- 22 సీజన్ లో దబాంగ్ ఢిల్లీ కేసీ టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. ఇక 2023-2024 లో పుణేరి పల్టాన్ ( Puneri Paltan ) టైటిల్ ఎగురేసుకు వెళ్ళింది. అంటే ప్రో కబడ్డీ టోర్నమెంట్ లో ఇప్ప‌టి వ‌ర‌కు రెండు సార్లు ఛాంపియ‌న్ గా నిలిచింది దబాంగ్ ఢిల్లీ కేసీ. ఛాంపియ‌న్ గా దబాంగ్ ఢిల్లీ కేసీ నిల‌వ‌డంతో ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకుంటున్నారు.


ప్రో క‌బడ్డీ 2025 ఫ్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?

ప్రో కబడ్డీ 2025 టోర్నమెంట్ ( Pro Kabaddi  2025) ఛాంపియ‌న్ గా దబాంగ్ ఢిల్లీ కేసీ ( Dabang Delhi K.C.) నిలిచిన సంగ‌తి తెలిసిందే. దీంతో ప్రో కబడ్డీ 2025 టోర్నమెంట్ లో ఛాంపియ‌న్ గా నిలిచిన జ‌ట్టుకు ఫ్రైజ్ మ‌నీ ఎంత ఇస్తార‌నే దానిపైన స‌రికొత్త చ‌ర్చ మొదలైంది. ముందుగా ఫిక్సయిన లెక్క ప్రకారం ఛాంపియన్ దబాంగ్ ఢిల్లీ కేసీ ( Dabang Delhi K.C.) జట్టుకు మూడు కోట్ల ప్రైస్ మనీ అందించబోతున్నారు. ఇక రన్న‌ర‌ప్‌ గా నిలిచిన పుణేరి పల్టాన్ జట్టుకు 1.8 కోట్లు వస్తాయి. సెమీ ఫైనల్ లో ఓడిపోయిన బెంగాల్ వారియర్స్ తో పాటు పాట్నా పైరేట్స్ జట్లకు రూ. 90 లక్షల చొప్పున అందించబోతున్నారు. ఇక 2025 ప్రో కబడ్డీ టోర్నమెంటులో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా పుణేరి పల్టాన్ జట్టుకు చెందిన అస్లాం నిలిచాడు. రైడర్ ఆఫ్ ద సీజన్ గా బెంగాల్ వారియర్స్ కు ( bengal ) చెందిన దేవంక్‌ నిలవడం జరిగింది.

Also Read: SHREYAS IYER: గాయంపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్.. క‌న్నీళ్లు పెట్టుకోవాల్సిందే

Related News

Gambhir: గంభీర్‌ ఓ చీడ పురుగు.. బ్యాటింగ్ ఆర్డ‌ర్ మార్చ‌డంపై ట్రోలింగ్‌, హ‌ర్షిత్ రాణాను ఓపెన‌ర్ గా దించుకో!

AUS vs IND: గంభీర్ త‌ప్పుడు నిర్ణ‌యాలు…రెండో టీ20లో ఆస్ట్రేలియా విజ‌యం

AUS vs IND: హ‌ర్షిత్ రాణా ఊచ‌కోత‌.. 104 మీట‌ర్ల సిక్స‌ర్..ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Jemimah: ధోని బ్యాట్ కంటే, నా బ్యాట్ బరువే ఎక్కువ.. జెమిమా కామెంట్స్ వైరల్

Aus vs Ind, 2nd T20I: టాస్ ఓడిన టీమిండియా..అర్ష‌దీప్ కు మ‌రోసారి నిరాశే..తుది జ‌ట్లు ఇవే

Rishabh Pant: రిషబ్ పంత్ చిలిపి పనులు.. తోటి ప్లేయర్ పై పడుకొని మరి.. కామాంధుడు అంటూ ట్రోలింగ్!

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మపై దారుణంగా ట్రోలింగ్.. ఇదేం బ్యాగ్ రా అంటూ

Big Stories

×