E-Paper
Advertisement

WI Team In Traffic : ట్రాఫిక్ లో చిక్కుకున్న వెస్టిండీస్… ఆగిపోయిన టాస్… క్రికెట్ చరిత్రలోనే తొలిసారి

WI Team In Traffic : ట్రాఫిక్ లో చిక్కుకున్న వెస్టిండీస్… ఆగిపోయిన టాస్… క్రికెట్ చరిత్రలోనే తొలిసారి
Advertisement

WI Team In Traffic :  సాధారణంగా వర్షం కారణంగా మ్యాచ్ ప్రారంభం ఆలస్యం కావడం మనం చూస్తుంటాం. అలాగే పిచ్ చిత్తడి గా ఉండటం వల్ల.. ఫ్లడ్ లైట్స్ వెలగకపోవడం వల్ల, బౌన్సి పిచ్ కారణంగా ప్లేయర్ల కి గాయాలు అయితే.. మిడతల గుంపు దాడి చేసినప్పుడు.. లేక గ్రౌండ్ లోకి పాము, కుక్క ఇలాంటివి వచ్చినప్పుడు మ్యాచ్ కి అంతరాయం కలిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఇవాళ ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండిస్ మధ్య మూడో వన్డే ఓ వింత కారణం వల్ల ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభం అయింది. భారత కాలమానం ప్రకారం.. ఇవాళ సాయంత్రం.. 5 గంటలకు టాస్ జరగాల్సి ఉంది. కానీ వెస్టిండిస్ ప్లేయర్లు .. హోటల్ రూమ్ నుంచి సరైన సమయానికి బయలుదేరినప్పటికీ.. వారి టీమ్ బస్సు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయింది. దీంతో దాదాపు 40 నిమిషాల పాటు ప్లేయర్లు ఆలస్యంగా స్టేడియానికి వచ్చారు.

Also Read :  Chris Gayle: కోహ్లీకి గేల్ వెన్నుపోటు…ఇంత దారుణం ఎక్కడా ఉండదు !

Advertisement

బర్మింగ్ హోమ్ లో జరిగిన మొదటి వన్డేలో ఇంగ్లాండ్ జట్టు 238 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ తరువాత కార్డిప్ తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్ జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.  తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు.. 47.4 ఓవర్లలో 308 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ లక్ష్య ఛేదనలో జెమీ స్మిత్, బెన్ డకౌట్, జోస్ బట్లర్ డకౌట్ అయ్యారు. అయితే జోస్ బట్లర్ 139 బంతుల్లో 21 ఫోర్లు, 2 సిక్సర్లతో 166 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి.. ఇంగ్లాండ్ జట్టు కి విజయాన్ని అందించాడు. చివరి వన్డే లో గెలిచి సిరీస్ ని క్లీన్ స్వీప్ చేయాలనుకుంది. ఆతిథ్య ఇంగ్లాండ్ మరోవైపు చివరి వన్డేలోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తోంది.

Also Read :  Musheer Khan : విరాట్ కోహ్లీ పరువు తీసిన ముషీర్ ఖాన్… మిమ్మల్ని టైటిల్ గెలవనివ్వమంటూ సిగ్నల్స్

Advertisement

మరోవైపు టాస్ ఆలస్యంగా జరగడంతో మ్యాచ్ కి ఆలస్యం అయింది. అయితే ఈ మ్యాచ్ లో వెస్టిండిస్ జట్టు 15 ఓవర్లకు 83 పరుగులు చేసింది. ఇక వెస్టిండిస్ బ్యాటర్లలో బ్రాండన్ కింగ్ 16 పరుగులు చేసి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ లెవిస్ 8 పరుగులకే ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో కెప్టెన్ హోప్ డకౌట్ గా వెనుదిరిగాడు. రూథర్ పోర్డ్ 33, కార్టీ 24 పరుగులతో ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో తెగ చర్చించుకోవడం విశేషం. అయితే వర్షం కారణంగా కొద్ది సేపు మ్యాచ్ ఆగిపోయింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోవడంతో.. మ్యాచ్ ని 50 ఓవర్ల నుంచి 40 ఓవర్లకు కుదించారు. మళ్లీ మ్యాచ్ ప్రారంభం అయింది. వెస్టిండిస్ జట్టు ఆటగాళ్లు బ్యాటింగ్ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తుందో వేచి చూడాలి మరీ.

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×