4 Day Test: టెస్ట్ మ్యాచ్ లపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ( International Cricket Council ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నాలుగు రోజులపాటు టెస్టులు నిర్వహించాలని.. ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. ఈ మేరకు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 2027 – 2029 మధ్య జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సీజన్ లో చిన్న దేశాలకు నాలుగు రోజుల టెస్టులను జరపాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు ది గార్డియన్ అనే పత్రిక కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.
Also Read: Yograj Singh: Ms ధోని వల్ల 7 గురి క్రికెటర్ల జీవితాలు నాశనమయ్యాయి.. యోగ్ రాజ్ హాట్ కామెంట్స్!
నాలుగు రోజుల టెస్టులకే ఐసీసీ ( International Cricket Council ) మొగ్గు
వచ్చే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సీసన్ లో ( World Test Championship Season) చిన్న దేశాలకు మాత్రమే ఈ నాలుగు రోజుల టెస్టులు నిర్వహించి.. మిగతా జట్లకు మరోలా ప్లాన్… చేయబోతున్నారు. టీమిండియా, ఇంగ్లాండ్ , ఆస్ట్రేలియా జట్లు మాత్రమే… ఐదు రోజులపాటు జరిగే టెస్ట్ మ్యాచ్లు ఆడబోతున్నాయని… ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అంటే ఈ మూడు పెద్ద జట్లు మినహా అన్ని జట్లు కూడా నాలుగు రోజుల పాటు టెస్ట్ మ్యాచులు ( Test Matches) ఆడనున్నాయన్నమాట. ఇక ఇటీవల వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ( World Test Championship Final ) సమయంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జై షా ( International Cricket Council Chairman Jay Shah ) ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించినట్లు కూడా ది గార్డియన్ పత్రిక వెల్లడించింది. చిన్న జట్లకు ఎక్కువ మ్యాచులు ఆడే అవకాశం రావాలనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ ప్రకటన రాగానే… మ్యాచులు కూడా ప్రారంభమవుతాయి.
Also Read: Ashwin Ball Tampering: బాల్ టాంపరింగ్ వివాదంలో అశ్విన్.. ఇక పై ఆడకుండా బీసీసీఐ బ్యాన్?
క్రికెట్ లో మరో రెండు కొత్త రూల్స్
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మరో రెండు కొత్త రూల్స్ తీసుకురాబోతున్నట్లు ప్రకటన చేసింది. ఈ రూల్స్ జూన్ 17 అంటే ఇవాల్టి నుంచి అమలులోకి రాబోతున్నాయి అన్నమాట. వన్డేల్లో మాత్రమే రూల్స్ తీసుకువస్తున్నారు. వన్డేలలో… రెండు కొత్త బంతులను 34వ ఓవర్ వరకు వినియోగించుకోవచ్చు. అలాగే మిగతా 16 ఓవర్ల కోసం మిగిలిన రెండు బంతుల్లో ఏదైనా ఒక బంతిని వాడుకోవచ్చు. ఇక కంకషన్ సబ్ స్టిట్యూట్ పై కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం… వికెట్ కీపర్, బ్యాటర్, సీమర్, స్పిన్ బౌలర్స్ అలాగే ఆల్రౌండర్ పేర్లను ఒక్కోటి చొప్పున మ్యాచ్ ప్రారంభం కంటే ముందే తెలపాల్సి ఉంటుంది. అదే సమయంలో బండరీ లైన్ బయట వెళ్లి రెండుసార్లు బంతిని పుష్ చేస్తూ.. క్యాచ్ పడితే… నాట్ అవుట్ గా పరిగణించనున్నారు.