BigTV English
Advertisement

India Squad for England Series: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ కు టీమిండియా జట్టు ప్రకటన… బుమ్రా ఔట్?

India Squad for England Series: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ కు టీమిండియా జట్టు ప్రకటన… బుమ్రా ఔట్?

India Squad for England Series: ఫిబ్రవరి 19వ తేదీ నుండి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం అవుతుంది. కానీ అంతకుముందే ఈనెల జనవరి 22న స్వదేశంలో ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ లు టీ-20 సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తరువాత ఫిబ్రవరి 6 నుంచి 3 వన్డేల సిరీస్ మొదలవుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి ముందు ఈ సిరీస్ లు ఓ ప్రాక్టీస్ అనుభూతిని ఇస్తాయి. ఇండియా – ఇంగ్లాండ్ మధ్య జరిగే తొలి టీ-20 మ్యాచ్ కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో జనవరి 22న ప్రారంభం అవుతుంది.


Also Read: India Squad for Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ.. భారత జట్టు ప్రకటన.. గిల్ కు బంపర్ ఆఫర్

రెండవ టీ-20 మ్యాచ్ చెన్నై చిదంబరం స్టేడియంలో జనవరి 25న, మూడవ టీ-20 రాజ్కోట్ లో జనవరి 28న, నాలుగోవ టి-20 పూణేలో జనవరి 31న, ఐదవ టి20 ఫిబ్రవరి 2న ముంబైలో జరుగుతాయి. ఈ టి – 20 లకు సూర్య కుమార్ యాదవ్ నాయకత్వంలోని జట్టును ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ టి-20 సిరీస్ ముగిసిన అనంతరం ఫిబ్రవరి 6వ తేదీ నుండి 3 వన్డేల సిరీస్ మొదలవుతుంది. ఇంగ్లాండ్ తో జరిగే ఈ 3 వన్డేల సిరీస్, అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం రోహిత్ శర్మ నాయకత్వంలోని జట్టును జనవరి 18వ ప్రకటించారు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్.


ఇంగ్లాండ్ తో 3 వన్డేల సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి పూర్తి భారత జట్టు : రోహిత్ శర్మ ( కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా/హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, యశస్వి జస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అదరగొట్టిన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి ఈసారి నిరాశ ఎదురైంది.

పేస్ ఆల్రౌండర్లలో హార్దిక్ పాండ్యా వైపే సెలెక్టర్లు మొగ్గు చూపారు. దీంతో తెలుగు క్రికెట్ అభిమానులు నిరాశకు గురయ్యారు. మరోవైపు పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్, బ్యాటర్ తిలక్ వర్మను కూడా జట్టులోకి తీసుకోలేదు. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రతినిత్యం లేకుండా పోయింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గాయపడిన బుమ్రా ఛాంపియన్ ట్రోఫీలో ఆడడం అనుమానమైన వార్తలకు తెరపడింది.

Also Read: Actor Chiranjeevi: క్రికెట్‌ లో చిరంజీవి పెట్టుబడులు.. ఢిల్లీ కాపిటల్స్‌ తో కలిసి భారీ స్కెచ్‌ !

ఈ జట్టులో బుమ్రా పేరును సెలెక్టర్లు ప్రకటించారు. కానీ గాయం కారణంగా ఇంగ్లాండ్ తో జరగబోయే మొదటి రెండు వన్డేలకు అతడు అందుబాటులో ఉండడం లేదు. ఇంగ్లాండ్ తో జరగబోయే 3 వన్డేల షెడ్యూల్ వివరాలు చూస్తే ఫిబ్రవరి 6వ తేదీన మొదటి వన్డే నాగపూర్ వేదికగా జరుగుతుంది. ఫిబ్రవరి 9న రెండవ వన్డే కటక్ లోని బారాబతి స్టేడియం వేదికగా జరుగుతుంది. ఫిబ్రవరి 12వ తేదీన మూడవ వన్డే అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్ లు ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతాయి.

 

Related News

Hong Kong Sixes 2025: నేడు టీమిండియా వ‌ర్సెస్ పాకిస్తాన్ మ‌ధ్య 6 ఓవ‌ర్ల మ్యాచ్‌…షెడ్యూల్‌, ఉచితంగా ఎలా చూడాలంటే

Anushka-Kohli: కోహ్లీ – అనుష్క శర్మ విడాకులు ?సోష‌ల్ మీడియాలో దారుణంగా పోస్టులు

WPL Retention 2026 : రిటైన్ లిస్టు ఇదే..WPL 2026 టోర్న‌మెంట్ షెడ్యూల్ ఇదే..!

IND VS AUS 4th T20I : వాషి యో వాషి..3 వికెట్లు తీసిన వాషింగ్ట‌న్‌, కంగారుల‌పై టీమిండియా విజ‌యం

Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Tata Motors: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్ల‌కు టాటా బంప‌ర్ ఆఫ‌ర్‌

PV Sindhu: బోల్డ్ అందాలతో రెచ్చిపోయిన PV సింధు.. వెకేషన్ లో భర్తతో రొమాన్స్

IND VS AUS, 4th T20I: టాస్ ఓడిన టీమిండియా..మ్యాక్స్‌వెల్ తో పాటు 4 గురు కొత్త‌ ప్లేయ‌ర్లు వ‌చ్చేస్తున్నారు

Big Stories

×