Mohammad Kaif On Gambhir: టీమిండియా వర్సెస్ జింబాబ్వే (Team India vs Zimbabwe) మధ్య నిన్న టి20 సిరీస్ (India tour of Zimbabwe 2026) ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మొదటి మ్యాచ్ లోనే అద్భుతంగా రాణించిన టీమ్ ఇండియా విక్టరీ నమోదు చేసుకుంది. జింబాబ్వేపై ఏకంగా 7 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకొని.. అభిమానులకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. అయితే టీమిండియా విక్టరీ సాధించిన నేపథ్యంలో గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) పని అయిపోయినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వివిఎస్ లక్ష్మణ్ రాగానే టీమిండియా విజయాల బాట పట్టిందని అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే మహమ్మద్ కైఫ్ (Mohammad Kaif) కూడా రియాక్ట్ అయ్యారు. బీసీసీఐ చెప్పక ముందే గంభీర్ తప్పుకోవాలని.. లేకపోతే అతని పరువు పోతుందని హెచ్చరించారు. టి20 బాధ్యతలు వివిఎస్ లక్ష్మణ్ కు (VVS Laxman) ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.
Also Read: 6, 6, 6, 6 వైభవ్ సిక్సుల వర్షం..A సింబల్ చూపిస్తూ సెలబ్రేషన్స్, టీమిండియా విజయం
జింబాబ్వే టూర్ లో టీమిండియా అద్భుతంగా రానించి తొలి మ్యాచ్ గెలిచిన నేపథ్యంలో… క్రికెట్ అభిమానులలో నూతన ఉత్సాహం నెలకొంది. గౌతమ్ గంభీర్ ఇంటికి వెళ్లి… వివిఎస్ లక్ష్మణ్ రాగానే టీమిండియా కు మంచి రోజులు వచ్చాయని సోషల్ మీడియాలో అభిమానులు పోస్టులు పెడుతున్నారు. అయితే దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ కూడా రియాక్ట్ అయ్యారు. గౌతమ్ గంభీర్ ను హెడ్ కోచ్ పదవి నుంచి తీసేయాలని ఇప్పటికే బీసీసీఐ (BCCI) నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
సరైన సమయంలో కచ్చితంగా బీసీసీఐ యాక్షన్ తీసుకోవడం గ్యారెంటీ అని వివరించారు. జింబాబ్వేతో టీమిండియా గెలిచిన నేపథ్యంలో ఆ దిశగా భారత క్రికెట్ నియంత్రణ మండలి అడుగులు వేస్తోందని వెల్లడించారు. ఏ క్షణమైనా బాంబు పేలుతుందని వార్నింగ్ ఇచ్చారు. అయితే గౌతమ్ గంభీర్ పైన బీసీసీఐ యాక్షన్ తీసుకోకముందే అతడు అలర్ట్ గా ఉండాలని కోరారు. కాస్త నెగ్లెక్ట్ చేసినా… గౌతమ్ గంభీర్ పరువు పోతుందని వార్నింగ్ ఇచ్చారు. బిసిసిఐ తొలగించక ముందే.. గౌతమ్ గంభీర్ తన పదవికి రాజీనామా చేయాలని కోరారు.
అలా కాకుండా మొండి చేస్తే, మాత్రం మెడలు పట్టి గెంటేస్తుందని గంభీర్ కు వార్నింగ్ ఇచ్చారు. మరి దీనిపై గౌతమ్ గంభీర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇది ఇలా ఉండగా జింబాబ్వే వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మరో రెండు టీ20 లు ఉన్నాయి. ఇందులో కూడా టీమిండియా విజయం సాధిస్తే… అందరూ అనుకున్నట్లుగానే బీసీసీఐ రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. వీవీఎస్ లక్ష్మణ్ కు టీ20 కోచింగ్ బాధ్యతలు ఇచ్చి… గంభీర్ ను తప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Also Read: ఆ పాకిస్తాన్ వెధవను వద్దని మొత్తుకున్నా, కావ్యనే వినలేదు.. SRH కోచ్ సీరియస్