E-Paper
Advertisement

Ind Vs Ban: గంభీర్‌ భారీ స్కెచ్‌…రెండో టెస్ట్​కు బ్లాక్ సాయిల్ పిచ్..బంగ్లాకు ఇక చుక్కలే ?​

Ind Vs Ban: గంభీర్‌ భారీ స్కెచ్‌…రెండో టెస్ట్​కు బ్లాక్ సాయిల్ పిచ్..బంగ్లాకు ఇక చుక్కలే ?​
Advertisement

 

India vs Bangladesh 2nd Test Playing 11, Pitch report, live time, streaming: టీమిండియా రెండో టెస్ట్‌ కు రెడీ అవుతోంది. చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత జట్టు బంగ్లాదేశ్ ను చిత్తుచిత్తుగా ఓడించింది. ఇప్పుడు భారత జట్టు కాన్పూర్ లో రెండో మ్యాచ్ ఆడబోతోంది. కాన్పూర్ లో నల్ల మట్టి పిచ్ ను రూపొందిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నల్ల మట్టి పిచ్ పై స్పిన్నర్ల డామినేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా కాన్పూర్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. దీంతో ముగ్గురు స్పిన్నర్లను బరిలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

ఇద్దరు స్పిన్నర్లుగా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ఉండడం జరుగుతోంది. మరో స్పిన్నర్ ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ వీరిద్దరి మధ్య పోటీ మరి ఎక్కువగా కనిపిస్తోంది. బాల్ తో పాటు బ్యాట్ తోను రాణించాలంటే అక్షర్ పటేల్ కు ఎక్కువ మార్కులు పడే ఛాన్స్ ఉంది. కానీ గత కొంతకాలం నుంచి టెస్టుల్లో అక్షర్ పటేల్ పెద్దగా తన ఇంపాక్ట్ ను చూపించడం లేదనే వాధనలు గట్టిగానే వినిపిస్తున్నాయి. దీంతో జట్టులోకి కుల్దీప్ యాదవ్ ను తీసుకోవాలనే వాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి.

Also Read: IPL 2025: ఐపీఎల్‌ జట్లకు BCCI గుడ్‌ న్యూస్‌..తెరపైకి కొత్త 4+2 రిటెన్షన్ పాల‌సీ…?

Advertisement

2021లో కాన్పూర్ లో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు ముగ్గురు స్పిన్నర్లతోనే ఆడింది. అప్పుడు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ వీరు ముగ్గురు బరిలోకి దిగారు. అక్షర్ పటేల్ 6 వికెట్లతో తన సత్తాను చాటుకున్నాడు. కాన్పూర్ గణాంకాలను పరిగణలోకి తీసుకుంటే టీం మేనేజ్మెంట్ ఆలోచనలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారుతుంది. ముగ్గురు స్పిన్నర్లతోనే బరిలోకి దిగాలని మాజీలు చెబుతున్నారు. తుది జట్టులో ఎవరు ఉన్నా ముగ్గురు స్పిన్నర్లు ఉండాల్సిందేనని అంటున్నారు.

Also Read:  IPL 2025: ధోని అదిరిపోయే ప్లాన్‌..CSKలోకి అశ్విన్, షమీ..!

అయితే నల్ల మట్టి పిచ్ పై ఆడినట్లయితే బంగ్లాదేశ్ తో అలర్ట్ గా ఉండాలని సూచనలు చేస్తున్నారు. తొలి మ్యాచ్ లో విజయం సాధించాము కదా అని రెండవ మ్యాచ్ ను చాలా లైట్ గా తీసుకోవద్దని అనుకుంటున్నారట. అందుకే రోహిత్‌ శర్మ కూడా చాలా ఫోకస్ చేస్తున్నారట. ముగ్గురు స్పిన్నర్ల లో ఎవరూ ఫైనల్‌ లిస్ట్‌ లో ఉంటారో చూడాలి.

 

భారత్ ప్లేయింగ్ 11 : రోహిత్ శర్మ(సి), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్(w), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా/కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్.

బంగ్లాదేశ్ ప్లేయింగ్ 11 : షాద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(సి), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిట్టన్ దాస్(w), మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, నహిద్ రాణా.

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×