Inzamam-ul-Haq: న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరిగిన మూడవ టీ20లో అభిషేక్ శర్మ ( Abhishek Sharma ) ఇరగదీసిన సంగతి తెలిసిందే. తన విధ్వంసకర బ్యాటింగ్ తో టీమిండియాను 10 ఓవర్లలోనే గెలిపించేశాడు అభిషేక్ శర్మ. ఈ తరుణంలోనే 14 బంతుల్లోనే అర్థ సెంచరీ నమోదు చేశాడు అభిషేక్. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ బ్యాట్ ను న్యూజిలాండ్ క్రికెటర్లు చెక్ చేసిన సంగతి తెలిసిందే. అసలు బ్యాట్ లో ఏముంది ? ఇంత భయంకరంగా ఆడుతున్నాం అంటూ మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత అభిషేక్ శర్మను ఆరా తీశారు న్యూజిలాండ్ క్రికెటర్లు. ఈ సంఘటన వైరల్ అవుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ వుల్ హక్ ( Inzamam-ul-Haq) సంచలన వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ శర్మ బ్యాటలో ఏదో ఉందని.. కచ్చితంగా ఐసీసీ దీనిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
న్యూజిలాండ్ పై అత్యంత ప్రమాదకరంగా బ్యాటింగ్ చేసిన అభిషేక్ శర్మను అవమానిస్తూ ఇంజమామ్ వుల్ హక్ సంచలన ఆరోపణలు చేశాడు. అభిషేక్ శర్మ బ్యాటింగ్ పై అనేక అనుమానాలు ఉన్నట్లు బాంబు పేల్చాడు. అభిషేక్ శర్మ వాడుతున్న బ్యాట్ లో చిప్ లు ఉన్నాయని పేర్కొన్నాడు. వెంటనే దీనిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ దర్యాప్తు చేయాలని కూడా డిమాండ్ చేశాడు. లేకపోతే న్యూజిలాండ్ లాంటి భయంకరమైన బౌలర్లను ఇలా చితక బాదడం ఏంటి ? భయంకరమైన సిక్సర్లు కొట్టడం ఏంటి ? ఏమాత్రం నమ్మశక్యం గా లేదంటూ విమర్శలు చేశాడు ఇంజమామ్ వుల్ హక్. కచ్చితంగా దీనిపై ఐసీసీ దర్యాప్తు చేయాలని.. లేకపోతే టి20 ప్రపంచ కప్ లో అభిషేక్ శర్మ మరింత భయంకరంగా ఆడతాడని హెచ్చరించాడు ఇంజమామ్ వుల్ హక్. ఇక ఇంజమామ్ వుల్ హక్ ఇలా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో టీమిండియా ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. బ్యాట్ లో ఎలాంటి చిప్ లు లేవని… పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఇలాగే బురద చల్లుతారని ఫైర్ అవుతున్నారు. గతంలో కూడా ఇలాగే అభిషేక్ శర్మ బ్యాట్ లో చిప్ లు ఉన్నాయని ఇంజమామ్ వుల్ హక్ ఆరోపణలు చేసినట్లు గుర్తు చేస్తున్నారు ఫ్యాన్స్.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మూడో టీ20లో అభిషేక్ శర్మ దుమ్ములేపాడు. 14 బంతుల్లోనే అర్థ సెంచరీ చేశాడు. దీంతో టీమిండియా తరఫున ఫాస్టెస్ట్ అర్ధసెంచరీ చేసిన రెండో ప్లేయర్ గా రికార్డులోకి ఎక్కాడు. అభిషేక్ కంటే ముందు యువరాజ్ సింగ్ ముందుగా ఉన్నాడు. 12 బంతులలోనే యూవీ 50 పరుగులు చేశాడు.
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==