E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

ఐర్లాండ్ ఒక్కటే కాదు ఇంగ్లాండ్ తోనూ ఓడిపోతారు…లేకపోతే బట్టలు లేకుండా తిరుగుతా!

ఐర్లాండ్ ఒక్కటే కాదు ఇంగ్లాండ్ తోనూ ఓడిపోతారు…లేకపోతే బట్టలు లేకుండా తిరుగుతా!
Advertisement

Inzamam-ul-Haq :  టీమిండియా వర్సెస్ ఐర్లాండ్ మధ్య నిన్న టి20 సిరీస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ టి 20 సిరీస్ నేపథ్యంలో మొదటి మ్యాచ్ నిన్న జరగగా, ఐర్లాండ్ చేతిలో టీమిండియా 34 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ గెలిచిన టీమిండియా, పసికూన ఐర్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది దీంతో శ్రేయస్ అయ్యర్ సేనను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ప్రత్యర్థి పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కూడా రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇజ్జమామ్ ఉల్ హక్ కూడా టీమిండియాను హేళన చేస్తూ మాట్లాడారు. టీమిండియా ప్లేయర్లకు ఐపీఎల్ తప్ప అంతర్జాతీయ క్రికెట్ ఆడటం చేతకాదు అంటూ పరువు తీశారు. అందుకే నిన్న ఐర్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయినట్లు విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఇజ్జమామ్ ఉల్ హక్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

 

ఐపీఎల్ తప్ప అంతర్జాతీయ క్రికెట్ టీం ఇండియాకు చేతకాదు

Advertisement

టీమిండియా వర్సెస్ ఐర్లాండ్ మధ్య నిన్న టి20 సిరీస్ ప్రారంభమైంది. అయితే ఈ టి 20 సిరీస్ నేపథ్యంలో మొదటి మ్యాచ్ లోనే దారుణంగా ఓడిపోయింది టీమిండియా. ఈ క్రమంలో కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుగా, పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమాం… టీమిండియా పై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. టీమిండియా ప్లేయర్లకు ఐపిఎల్ ఆడడం తప్ప, ఏది చేతకాదు అంటూ హేళన చేశారు. ఐర్లాండ్ జట్టులో దాదాపు ఐదుగురు కీలక ప్లేయర్లు గాయాల పాలు అయ్యారని, అయినప్పటికీ బచ్చా క్రికెటర్ల చేతిలో టీమిండియా ఓడిపోయిందని విమర్శలు చేశారు. తోపు ఆటగాళ్లు ఉన్న టీమిండియా, పసికూన ఐర్లాండ్ చేతిలో ఓడిపోవడం పరువు తీసుకోవడమే అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు.

ఐర్లాండ్ ఒక్కటే కాదు ఇంగ్లాండ్ లోనూ ఓడిపోతారు… లేకపోతే బట్టలు లేకుండా తిరుగుతా!

మూడు నెలల కిందట టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ టైటిల్ గెలుచుకున్న టీమిండియా, మేమే మొనగాళ్ల మంటూ రెచ్చిపోయిందని గుర్తు చేశారు. కానీ, ఐర్లాండ్ వెళ్ళిన తర్వాత, టీమిండియా అసలు రంగు బయటపడిందని ఎద్దేవా చేశారు. ఐర్లాండ్ పైన గెలవలేని టీమిండియా, వరల్డ్ ఛాంపియన్ జట్టు ఎలా అవుతుందని నిలదీశాడు. వరల్డ్ ఛాంపియన్స్ అన్న ట్యాగ్ తొలగించుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. నిన్న ఒక్క మ్యాచ్ కాదు ఐర్లాండ్ చేతిలో ఈ టి 20 సిరీస్ కూడా టీమిండియా కోల్పోవడం గ్యారంటీ అన్నారు. ఇంగ్లాండ్ గడ్డపై కూడా టీమిండియా ఓడిపోయి, ఇంటి దారి పడుతుందని హెచ్చరించారు. అలా జరగకపోతే బట్టలు లేకుండా తాను లాహోర్ వీధుల్లో తిరుగుతానంటూ శపథం చేశారు ఇంజమామ్.

Advertisement

ఇది ఇలా ఉండగా టీమిండియా వర్సెస్ ఐర్లాండ్ మధ్య జరిగిన నిన్నటి మ్యాచ్ లో 33 పరుగుల తేడాతో శ్రేయస్ అయ్యర్ సేన ఓటమి పాలు అయింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి ఐర్లాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. ఈ నేపథ్యంలో మొదటి బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్, 182 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో 18.5 ఓవర్లు ఆడిన టీమిండియా 148 పరుగుల వద్ద ఆల్ అవుట్ అయింది. దీంతో మొదటి మ్యాచ్ లో ఓడిపోవాల్సి వచ్చింది.

 

 

 

 

 

 

Related News

విదేశీ పిచ్ ల‌పై టీమిండియాకు ఆడ‌టం చేత‌కాదు, అందుకే ఐర్లాండ్ చేతిలో ప‌ళ్లు రాల‌గొట్టుకున్నారు

IND VS IRE: ఐర్లాండ్ చేతిలో టీమిండియా ఘోర ఓట‌మి…మంచు విష్ణు డైలాగ్ వైర‌ల్

వైభ‌వ్ ఇంకా స్కూల్ కు వెళ్లే పిల్లాడే, ఘోరంగా అవ‌మ‌నించిన ఐసీసీ

షోయ‌బ్ అక్త‌ర్ సోద‌రుడి అంత్య‌క్రియ‌లు..హాజ‌రైన‌ పహల్గామ్ సూత్రధారి

కెప్టెన్సీ చేత‌కాక‌పోతే, త‌ప్పుకుని ఇంట్లో కూర్చో..శ్రేయ‌స్ పై సెహ్వాగ్ సీరియ‌స్

అస‌లైన‌ ప్లేయ‌ర్లు ఐదుగురు ఆడింటే, 100లోపే టీమిండియా ఆలౌట్ అయ్యేది

త‌ప్పుల త‌డ‌క‌గా స్కోర్ బోర్డు, అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ క్యాన్సిల్

Big Stories

×