BigTV English
Advertisement

SRH Fans – IPL 2025: ఐపీఎల్ 2025 షెడ్యూల్ రిలీజ్.. షాక్ లో SRH ఫ్యాన్స్… కారణం ఇదే !

SRH Fans – IPL 2025: ఐపీఎల్ 2025 షెడ్యూల్ రిలీజ్.. షాక్ లో SRH ఫ్యాన్స్… కారణం ఇదే !

SRH Fans – IPL 2025: క్రీడాభిమానులను టి-20 కిక్కులో ముంచేసేందుకు, ఈ వేసవిలో క్రికెట్ అభిమానులను ఆదరించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} సిద్దమయింది. ఐపీఎల్ 18వ సీజన్ కి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ని భారత క్రికెట్ నియంత్రణ మండలి {బీసీసీఐ} ఆదివారం అధికారికంగా ప్రకటించింది. మార్చి 22 నుండి ప్రారంభం కాబోయే ఐపీఎల్ సీజన్.. మే 25 వరకు జరుగుతుంది.


Also Read: IPL – Wrestlers: ఏంట్రా ఈ అరాచకం… IPL 2025లోకి రెజర్లు.. SRH కెప్టెన్‌ గా బీస్ట్‌ ?

ఈసారి 13 స్టేడియాలలో మొత్తం 74 మ్యాచ్ లు జరుగుతాయి. తొలి మ్యాచ్ లో డిపెండింగ్ ఛాంపియన్ కలకత్తా నైట్ రైడర్స్ జట్టుతో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టు తలపడుతుంది. ఈడెన్ గార్డెన్స్ లో ఈ మ్యాచ్ జరగబోతోంది. ఫైనల్ మ్యాచ్ కి కూడా ఈడెన్ గార్డెన్స్ వేదిక కాబోతోంది. ఇక గత సీజన్ లో రన్నరప్ గా నిలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ మరోసారి ఉప్పల్ స్టేడియంలో పరుగుల వేటకు సిద్ధమైంది. హైదరాబాద్ జట్టు మార్చి 23న ఉప్పల్ లో తన తొలి మ్యాచ్ ఆడబోతోంది.


ఈ తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ని ఢీ కొడుతుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో మొత్తం తొమ్మిది మ్యాచ్ లు జరుగుతాయి. ఇందులో రెండు ప్లే ఆఫ్ మ్యాచ్ లు జరుగుతాయి. మే 20న క్వాలిఫైయర్ 1, మే 21న ఎలిమినేటర్ మ్యాచ్ లు హైదరాబాద్ లో జరుగుతాయి. అయితే ఈ ఐపీఎల్ 2025 షెడ్యూల్ పై సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులు నిరాశగా ఉన్నారు.

ఎందుకంటే లీగ్ మ్యాచ్ దశలో హైదరాబాద్ వేదికగా ఉప్పల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో మ్యాచ్ లేకపోవడం క్రీడాభిమానులకు, మరీ ముఖ్యంగా ఎస్.ఆర్.హెచ్ అభిమానులకు నిరాశ కలిగించింది. ఐపీఎల్ సీజన్ 18 షెడ్యూల్ ప్రకారం.. లీగ్ దశలో ఆర్సిబి తో కానీ, చెన్నై సూపర్ కింగ్స్ తో కానీ ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ జట్టుకు ఒక్క మ్యాచ్ కూడా లేదు. ఈ కారణంగా ఉప్పల్ లో జరిగే ఐపీఎల్ మ్యాచ్లకు వెళ్లే క్రీడాభిమానులకు విరాట్ కోహ్లీని, మహేంద్ర సింగ్ ధోనీని చూసే అవకాశం లేదు. కానీ బెంగళూరు, చెన్నై జట్లు ఉప్పల్ లో ఆడే అవకాశాలు లేకపోలేదు.

Also Read: Indian Cricketers – AI: టీమిండియా క్రికెటర్లు… LKG పిల్లలు అయిపోయారు ఏంటి?

క్వాలిఫైయర్ 1 మ్యాచ్, ఎలిమినేటర్ మ్యాచ్లు ఉప్పల్ వేదికగా జరగనున్న నేపథ్యంలో.. చెన్నై, ఆర్సిబి, ఎస్.ఆర్.హెచ్.. ఈ మూడు జట్లు ప్లే ఆఫ్స్ కి అర్హత సాధిస్తే ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ తో ఈ రెండు జట్లు తెలపడే అవకాశం ఉంది. ఇక లీగ్ లో ఉన్న పది జట్లను ఈసారి కూడా రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ 1 లో కలకత్తా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్. గ్రూప్ 2 లో గుజరాత్ టైటాన్స్, సన్రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెంట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఉన్నాయి. లీగ్ దశలో ఈ పది జట్లు.. ఒక్కో జట్టు మొత్తం 14 మ్యాచులు ఆడుతాయి.

Related News

Pratika Rawal Medal : ప్రతీకా రావల్ కు ఘోర అవ‌మానం..కానీ అంత‌లోనే ట్విస్ట్‌, ICC బాస్ జై షా నుంచి పిలుపు

Hong Kong Sixes 2025: దినేష్ కార్తీక్ చెత్త కెప్టెన్సీ.. కువైట్, UAE చేతిలో వ‌రుస‌గా ఓడిన టీమిండియా

Womens World Cup 2029: వ‌చ్చే వ‌ర‌ల్డ్ క‌ప్ 2029పై ఐసీసీ సంచ‌ల‌న నిర్ణ‌యం..ఇకపై 8 కాదు 10 జ‌ట్లకు ఛాన్స్‌, ఫాకిస్తాన్ కు నో ఛాన్స్ !

IND VS AUS 5th T20I: నేడే చివ‌రి టీ20..టీమిండియాను వ‌ణికిస్తున్న గ‌బ్బా…సూర్య, గిల్‌ కు ఇక లాస్ట్ ఛాన్స్‌

Abhishek- Gill LV Bag: ఏంట్రా అభిషేక్‌…నీ సంచులు దేశం మొత్తం అమ్మేస్తున్నారా? లేడీస్ హ్యాండ్ బ్యాగులుగా కూడా

CP Sajjanar : వీళ్లేం సెల‌బ్రిటీలు?…రైనా, ధావన్‌లపై స‌జ్జ‌నార్ సీరియ‌స్‌

Cm Revanth Reddy: హైదరాబాద్ లో మ‌రో అంత‌ర్జాతీయ స్టేడియం..ఆస్ట్రేలియా త‌ర‌హాలో బౌన్సీ పిచ్ లు

BBL New Rule : BBLలో కొత్త రూల్స్‌…ఇకపై బంతి తాకితే అభిమానుల‌కే, త్వ‌ర‌లో ఐపీఎల్ లో కూడా

Big Stories

×