ICC – Team India: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (ICC Women’s T20 World Cup 2026 Tournament ) చివరి దశకు వచ్చేసింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి చిన్న దేశాలన్నీ ఇప్పటికే ఎలిమినేట్ అయ్యాయి. ఇవాళ టీం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (Team India vs Australia) మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఇందులో టీమిండియా గెలిస్తేనే సెమీ ఫైనల్ అవకాశాలు ఉంటాయి. లేకపోతే బంగ్లాదేశ్ పై విజయం సాధిస్తే సౌత్ ఆఫ్రికా నేరుగా సెమీస్ కు వెళ్లే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా కు అనుకూలంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) వ్యవహరిస్తోందని వివాదాస్పద ఆరోపణలు చేశారు ఇంగ్లీష్ క్రికెటర్లు అలెక్స్ హార్ట్లీ (Alex Hartley), కేట్ క్రాస్ (Kate Cross) సెమీ ఫైనల్ కు టీమిండియా వెళ్తేనే ఐసీసీకి ఆదాయం పెరుగుతుందని, అందుకే ఆ జట్టు క్వాలిఫై కావడం గ్యారెంటీ అంటూ బాంబు పేల్చారు. ఐసీసీ (ICC) అలాగే బీసీసీఐ (BCCI) మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయని.. అందుకే ప్రతి ఐసీసీ టోర్నమెంట్లలో టీమిండియా ముందుకు దూసుకు వెళ్తోందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇద్దరు క్రికెటర్లు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (Board of Control for Cricket in India) పట్ల ఐసీసీ () పక్షపాతం చూపిస్తోందంటూ ఇంగ్లీష్ క్రికెటర్లు అలెక్స్ హార్ట్లీ (Alex Hartley), కేట్ క్రాస్ (Kate Cross) వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ గా మారింది. ఇవాళ ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా (Australia vs. Team India) మధ్య గ్రూప్ స్టేజిలో చివరి మ్యాచ్ జరగనుంది. ఇందులో టీమిండియా కచ్చితంగా గెలిచి, సెమీ ఫైనల్ కు వెళ్తుందని పరోక్షంగా ఈ ఇద్దరు ఇంగ్లీష్ క్రికెటర్లు ఆరోపణలు చేశారు. ఇండియా సెమీ ఫైనల్ కు వెళితేనే, ఐసీసీకి ఆదాయం వస్తుందని అందరూ నమ్ముతున్నట్లు వ్యాఖ్యానించారు. దానికి తగ్గట్టుగానే ఐసీసీ కూడా వ్యవహరిస్తుందని బాంబు పేల్చారు. టీమిండియా సెమీ ఫైనల్ కు వస్తే, వ్యూయర్షిప్ కూడా అత్యధికంగా పెరుగుతుంది.
ఇండియాలో క్రికెట్ కు బాగా క్రేజ్ ఉన్న నేపథ్యంలో… జనాలు ఎగబడి చూస్తారని పేర్కొన్నారు. ఈ క్రమంలో వ్యూయర్షిప్ పెరగడమే కాకుండా.. ఐసీసీకి కోట్లల్లో డబ్బులు వస్తాయని పేర్కొన్నారు. అందుకే టీమిండియా అను సెమీ ఫైనల్ కు పంపించేందుకే బీసీసీఐతో కలిసి ఐసీసీ కుట్రలు చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. కానీ ఇలా చేయడం చాలా దారుణం అంటూ మండిపడ్డారు. పోటీనిస్తూ సరిగ్గా ఆడే జట్లకు, అవకాశాలు ఇవ్వడం లేదని ఐసిసిపై మండిపడ్డారు. డబ్బుల కోసం బీసీసీ అయితే ఐసీసీ కుమ్మక్కు అయినట్లు ఆరోపణలు చేశారు. ఇది ముమ్మాటికి ఇతర జట్లకు అన్యాయమే అని తాము భావిస్తున్నట్లు ఓ రేంజ్ లో స్పీచ్ ఇచ్చారు. దీంతో ఈ ఇద్దరు క్రికెటర్లు ఇంగ్లీష్ క్రికెటర్లు అలెక్స్ హార్ట్లీ (Alex Hartley), కేట్ క్రాస్ (Kate Cross) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.