Babar Azam-IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( IPL 2026 ) అతి త్వరలో ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. మార్చి 26వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) ప్రారంభమవుతుందని వార్తలు వస్తున్నాయి. మే 31వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ కొనసాగనుందట. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజంకు ( Babar Azam ) బంపర్ ఆఫర్ తగిలినట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ లో బాబర్ ఆజం ఆడితే, రూ.500 కోట్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నాడట ముంబై ఇండియన్స్ ఓనర్ ముఖేష్ అంబానీ. ఐపీఎల్ 2026 లో ఆడాలని పర్సనల్ గా రిక్వెస్ట్ చేశాడట అంబానీ ( Mukesh Ambani ). ఈ విషయాన్ని తన్వీర్ అహ్మద్ పేర్కొన్నారు. దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ చుట్టూ రాజకీయాలు నడుస్తున్న నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు సంబంధించిన షాకింగ్ నిజాన్ని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ( Tanvir Ahmed) బయట పెట్టారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కోసం పాకిస్తాన్ క్రికెటర్లను ముఖేష్ అంబానీ సంప్రదించాడని బాంబు పేల్చాడట తన్వీర్ అహ్మద్. ఇందులో భాగంగానే ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా బాబర్ ఆజంకు ఛాన్స్ వచ్చినట్లు కూడా ఆయన తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా బాబర్ ఆజం బరిలోకి దిగితే, రూ.500 కోట్లు అయినా ఇచ్చేందుకు ముఖేష్ అంబానీ సిద్ధమయ్యాడని, ఈ మేరకు బాబర్ ఆజంకు ఆఫర్ కూడా ఇచ్చాడని షాకింగ్ కామెంట్స్ చేశారట తన్వీర్ అహ్మద్.
బీసీసీఐని ఒప్పించి మరీ బాబర్ ను తీసుకుంటానని ముఖేష్ అంబానీ హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారట. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు దుమారం రేపుతోంది. అయితే ఇది చూసిన ఇండియన్ ఫాన్స్, తన్వీర్ అహ్మద్ ను దారుణంగా విమర్శలు చేస్తున్నారు. బాబర్ ఆజం ఉచితంగా ఆడతానని ఆఫర్ ఇచ్చిన కూడా ఐపీఎల్ లో ఏ టీం తీసుకోదని వెల్లడిస్తున్నారు ఫ్యాన్స్. అసలు పాకిస్తాన్ ప్లేయర్లకు ఐపీఎల్ ఆడే అర్హత లేదని.. ఈ విషయం తన్వీర్ అహ్మద్ గుర్తు పెట్టుకోవాలని కౌంటర్ ఇస్తున్నారు. అనవసరంగా తప్పుడు ప్రచారం చేయకండి అని మండిపడుతున్నారు.
2008లో ముంబైలో కాల్పులు జరిపారు పాక్ ఉగ్రవాదులు. ఈ నేపథ్యంలో 2009లో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ టోర్నమెంట్ లో పాకిస్తాన్ ప్లేయర్లు ఆడకుండా ఆదేశాలు ఇచ్చింది. ఐపీఎల్ ప్రారంభంలో పాకిస్తాన్ ప్లేయర్లు ఆడినప్పటికీ.. దేశభద్రత, రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నేపథ్యంలో బ్యాన్ విధించింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ యాజమాన్యం.
?igsh=cWMwcGM4OXR1dTBv