PSL 2025: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (India vs Pakistan ) మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో… పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కొత్త వివాదానికి తెరలేపింది. ఉగ్రవాదులకు సపోర్ట్ గా నిలిచే ప్రయత్నం చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( IPL 2025) భాగంగానే పాకిస్తాన్లో కూడా పాకిస్తాన్ సూపర్ లీగ్ ( Pakistan Super League 2025) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో కూడా చాలామంది విదేశీ క్రికెటర్లు వాడుతున్నారు. డేవిడ్ వార్నర్ ( David Warner ) , కెన్ విలియమ్స్ ( Ken Williams ) లాంటి స్టార్ ప్లేయర్లు కూడా ఇందులో ఉన్నారు. ఐపీఎల్ మెగా వేలంలో ఎవరు కొనుగోలు చేయకపోతే పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడుతున్నారు.
Also Read: SRH Political Leaders : SRH టీమ్ లో నారా లోకేష్, బండి సంజయ్.. అంపైర్ గా RGV
అయితే తాజాగా… పాకిస్తాన్ ఉగ్రవాదులపై దాడులు చేసిన నేపథ్యంలో… ఇండియాను అందరూ మెచ్చుకుంటున్నారు. కానీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాత్రం ఉగ్రవాదులకు సపోర్ట్ గా నిలిచింది. ఉగ్రవాదులు మరణించారని…. పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్ ప్రారంభం కంటే ముందు… అన్ని జట్ల ప్లేయర్లతో స్టాండింగ్ ఓవేషన్… నిర్వహించింది. ఇండియాలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల ప్లేయర్లు ఆర్మీ దాన్ని మెచ్చుకుంటూ… రెండు నిమిషాల పాటు గ్రౌండ్లో నిల్చున్నారు.
అటు పాకిస్తాన్ దేశంలో మాత్రం… పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడే ప్లేయర్లు అందరూ కలిసి ఉగ్రవాదుల మరణాలకు నివాళులర్పించారు. స్టేడియంలో అన్ని జట్ల ప్లేయర్లు నిలబడి… సంతాపం తెలిపారు. ఇందులో ఫారిన్ క్రికెటర్లు కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ను సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ అధికారికంగా ప్రకటించింది. దీంతో పాకిస్తాన్, ఉగ్రవాదులకు ఉన్న సంబంధం బయటపడింది.
పాకిస్తాన్ వదిలి పారిపోతున్న క్రికెటర్లు
పాకిస్తాన్ ఉగ్రవాదులను చంపేందుకు ఆపరేషన్ సింధూర్ పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇండియన్ ప్రభుత్వం. దీంతో ఇప్పటికే వందమందికి పైగా ఉగ్రవాదులను చంపేసింది మోడీ ప్రభుత్వం. అయితే పాకిస్తాన్ దేశంపై ఇండియా దాడి చేస్తున్న నేపథ్యంలో… విదేశీ క్రికెటర్లు భద్రత కారణం చూపించి… తమ దేశానికి పారిపోతున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడకుండా వెళ్ళిపోతున్నారు. డేవిడ్ వార్నర్ అలాగే కేన్ మామ లాంటి చాలామంది ప్లేయర్లు కూడా పాకిస్తాన్ ను వదిలేస్తున్నారని సమాచారం. దీంతో పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 టోర్నమెంట్ మభ్యంతరంగానే ముగుస్తుందని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక అదే సమయంలో… పాకిస్తాన్ కూడా రెచ్చిపోతుంది. ఇండియా పై.. కచ్చితంగా రివర్స్ అటాక్ చేస్తామని వార్నింగ్ ఇస్తుంది. ప్రతి రక్తపు బొట్టుకు ప్రతిఫలం చెల్లించుకునేలా చేస్తామని తాజాగా పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ( Pak Pm Shariff) కూడా ప్రకటించారు. దీంతో ఇండియా ఇప్పుడు… అలర్ట్ అవుతుంది.
Also Read: Gandhi Ji with Kohli : RCB 18 ఏళ్ల కల నెరవేర్చిన గాంధీజీ.. సంబరాల్లో విరాట్ కోహ్లీ!
🇵🇰 #PakistanZindabad 🇵🇰 pic.twitter.com/LHsP5W81VM
— Pakistan Cricket (@TheRealPCB) May 7, 2025