E-Paper
Advertisement

IPL టోర్న‌మెంట్ వ‌ల్ల‌..టెస్ట్ క్రికెట్ చ‌చ్చిపోతోంది…SRH కెప్టెన్ క‌మిన్స్ సంచ‌ల‌నం!

IPL టోర్న‌మెంట్ వ‌ల్ల‌..టెస్ట్ క్రికెట్ చ‌చ్చిపోతోంది…SRH కెప్టెన్ క‌మిన్స్ సంచ‌ల‌నం!
Advertisement

Pat Cummins On IPL : ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ పైన (Indian Premier League tournament) ప్రతి ఒక్కడు కామెంట్ చేయడమే. 19 సంవత్సరాలుగా విజయవంతంగా కొనసాగుతున్న ఈ టోర్నమెంట్ ను ఉద్దేశించి రెచ్చిపోయి మాట్లాడుతూనే ఉన్నారు. విమర్శలు చేస్తూ రెచ్చిపోతున్నారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లైతే పొద్దున లేస్తే చాలు.. ఐపీఎల్ లో విమర్శించడం మొదలుపెడతారు. అయితే ఈ లిస్టులో తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ పాట్ కమ్మిన్స్ (Pat Cummins) కూడా చేరిపోయాడు. ఐపీఎల్ ను కించ‌ప‌రుస్తూ మాట్లాడాడు. ఐపీఎల్ టోర్నమెంటు కారణంగా టెస్ట్ క్రికెట్ చచ్చిపోతోందని బాంబు పేల్చారు. డబ్బులు ఒక ఆశపడి చాలా మంది క్రికెటర్లు టెస్ట్ క్రికెట్ ఆడడాన్ని మర్చిపోతున్నారని ఆగ్రహించారు. దీంతో పాట్ కమ్మిన్స్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: ఆ పాకిస్తాన్ వెధ‌వ‌ను వ‌ద్ద‌ని మొత్తుకున్నా, కావ్య‌నే విన‌లేదు.. SRH కోచ్ సీరియ‌స్‌

IPL టోర్న‌మెంట్ వ‌ల్ల‌..టెస్ట్ క్రికెట్ చ‌చ్చిపోతోంది !

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ చాలా ఉత్కంఠ భరితంగా ముందుకు సాగుతోంది. ఈ టోర్నమెంట్ 2008లో ప్రారంభమై.. 19 సంవత్సరాలు గా సక్సెస్ ఫుల్ గా దూసుకు వెళ్తోంది. అయితే అలాంటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ పైన సన్ రైజ‌ర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ (Pat Cummins) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లాంటి లీగ్స్‌ విపరీతంగా పెరిగిపోయాయని వెల్లడించారు. బీబీఎల్ లాంటి టోర్నమెంట్ల కంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ప్లేయర్లకు ఎక్కువగా డబ్బులు వస్తున్నాయని వివరించారు. దాంతో ఐపీఎల్ వైపు చాలా మంది క్రికెటర్లు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో టెస్ట్ క్రికెట్ ఆడేందుకు ఏ ఒక్క ప్లేయర్ ఆసక్తి చూపించకపోవడం దారుణం అన్నారు పాట్ కమ్మిన్స్.

ఐపీఎల్ వ‌ల్లే ప్లేయ‌ర్ల‌పై తీవ్ర‌మైన ఒత్తిడి

ఈ క్ర‌మంలో చాలా మంది క్రికెటర్లు ఐపీఎల్ వైపు వెళ్తున్న క్రమంలో.. టెస్ట్ క్రికెట్ ను ప్రోత్సహించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా చాలా కష్టపడుతోందని గుర్తు చేశారు పాట్ కమ్మిన్స్ (Pat Cummins). అయినప్పటికీ టెస్ట్ క్రికెట్ ఆడుతూనే… ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ద్వారా డబ్బులు పొందేందుకు చాలామంది క్రికెటర్లు పోటీ పడుతున్నారు అన్నారు. ఐపీఎల్ టోర్నమెంట్ తో పాటు టెస్ట్ క్రికెట్ ఆడేందుకు సిద్ధమవుతున్నారని వెల్లడించారు. ఈ క్రమంలో చాలా మంది క్రికెటర్లు గాయాల బారిన పడుతున్నారని గుర్తు చేశారు. తను కూడా అలాగే డబ్బులకు ఆశపడి.. గాయం బారిన పడ్డవాన్ని అంటూ గుర్తు చేశారు. అందుకే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో మొన్న సగం మ్యాచ్ లు ఆడినట్లు వివరించారు. 2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో తాము ఐపీఎల్ ఆడేది కూడా డౌట్ అని కుండ బద్దలు కొట్టి చెప్పారు పాట్ కమ్మిన్స్.

Advertisement

Also Read: 6, 6, 6, 6 వైభ‌వ్ సిక్సుల వ‌ర్షం..A సింబ‌ల్ చూపిస్తూ సెల‌బ్రేష‌న్స్‌, టీమిండియా విజ‌యం

 

 

Related News

బాబర్ ఆజం వ‌ర‌ల్డ్ క్లాస్ ప్లేయ‌ర్‌..కానీ అత‌న్ని పాక్ ప్లేయ‌ర్లే తొక్కేస్తున్నారు

ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టులో సంక్షోభం…త్వ‌ర‌లోనే క‌నుమ‌రుగు కావ‌డం ప‌క్కా

దొంగ సర్టిఫికెట్స్ తో వచ్చిన వాళ్లకే జపం…ICCపై పాకిస్తాన్ ఆరోపణలు

పాక్ ఒత్తిడికి తలొగ్గిన జై షా..ICC పదవికి రాజీనామా చేయాలంటూ !

15 ఏళ్ల వైభవ్ పై అతిగా ఆశలు పెట్టుకోవద్దు…శ్రీలంక మాజీ బౌలర్ వార్నింగ్

ఉస్మాన్ తారిక్ ను ఎదుర్కొనే మొనగాడు లేడు…కోహ్లీ కూడా డకౌట్ అవుతాడు

టీమిండియా గెలిస్తే చాలు, వరల్డ్ కప్ గెలిచినట్టే..పాకిస్తాన్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×