E-Paper
Advertisement

Jay Shah – IPL: RCB విజయం వెనుక జై షా స్క్రిప్ట్.. మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడా.. ఆ హోటల్ లో ఏం జరిగింది ?

Jay Shah – IPL: RCB విజయం వెనుక జై షా స్క్రిప్ట్.. మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడా.. ఆ హోటల్ లో ఏం జరిగింది ?

Jay Shah – IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాదాపు 18 సంవత్సరాల తర్వాత టైటిల్ అందుకుంది రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్టు. ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఫైనల్లో మొదటి బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అద్భుతంగా బ్యాటింగ్ చేసి… పంజాబ్ జట్టును కట్టడి చేసింది. దీంతో ఆరు వికెట్ల తేడాతో ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ జట్టు పైన విజయం సాధించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి.

ALSO READ: RCB Maiden IPL Trophy: 18 ఏళ్ల నిరీక్షణ… ఐపీఎల్ 2025 ఛాంపియన్ గా RCB… ప్రైజ్ మనీ ఎంతంటే

బెంగళూరు టైటిల్ గెలవడం వెనక జైషా కుట్రలు?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఛాంపియన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఛాంపియన్గా నిలిచిన నేపథ్యంలో.. సోషల్ మీడియాలో అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. ఈ ఫైనల్ మ్యాచ్ లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని చెబుతున్నారు. ఫైనల్ మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య ప్రారంభం కంటే ముందు రంగంలోకి జై షా దిగడంతో.. ఈ పరిస్థితి నెలపొందని ఆరోపణలు చేస్తున్నారు.

బెంగళూరు హోటల్ లో జై షా

ఐపీఎల్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభాని కంటే ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు క్రికెటర్లు ఉన్న హోటల్ కు నేరుగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్… జై షా వెళ్లిన సంగతి తెలిసిందే. ముందస్తుగా విరాట్ కోహ్లీకి కంగ్రాట్స్ చెప్పేందుకు జైషా రంగంలోకి దిగాడని.. అప్పటికే ఈ మ్యాచ్ ఫిక్స్ అయిపోయిందని కొంతమంది అంటున్నారు. నిన్న కూడా రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్టు ఉన్న హోటల్ కు జైషా వెళ్లడంతో… ఈ ప్రచారం మొదలైంది. ఇక దానికి తగ్గట్టుగానే ఫైనల్ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించడంతో… నిజంగానే ఫైనల్ మ్యాచ్లో ఫిక్సింగ్ జరిగిందని… చెబుతున్నారు.

ఇది ఇలా ఉండగా… ఫైనల్ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించిన తర్వాత… విరాట్ కోహ్లీ సెలబ్రేషన్స్ ఓ రేంజ్ లో చేసుకున్నారు. నరేంద్ర మోడీ స్టేడియం మొత్తం తిరుగుతూ విరాట్ కోహ్లీ ఎంజాయ్ చేశాడు. అలాగే మ్యాచ్ గెలిచిన తర్వాత కాస్త కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు విరాట్ కోహ్లీ. అనంతరం తన భార్య అనుష్క శర్మకు గట్టిగా హగ్ ఇచ్చి… ఆమెని కూడా స్టేడియంలోకి తీసుకువచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ALSO READ: Anushka Sharma-Virat Kohli: 18 ఏళ్ళ తర్వాత కప్.. అనుష్కకు టైట్ హాగ్ ఇచ్చి.. ఏడ్చేసిన కోహ్లీ

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×