22A Land: ప్రజల ఆస్తులను 22Aలో చేర్చడంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టింది. యాదగిరిగుట్టలోనే భారీగా భూములు నిషేధిత జాబితాలో చేరాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెబుతున్నారు. ఇది కేవలం టెక్నికల్ మిస్టేకా? లేక కావాలని చేసిన పనా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే చేశారా? కొందరు అధికారులు కావాలనే ఇలా వ్యవహరించారా? ఎవరి ఆదేశాలతో జాబితాలు మారాయి? ఎవరు అప్రూవ్ చేశారు? ఎవరి బెనిఫిట్ కోసం ఈ నిర్ణయాలు జరిగాయి? అసలు ఈ వ్యవహారంలో అన్నీ ప్రశ్నలే. ఒక్క ఆన్సర్ కూడా లేదు.
Also Read: 22ఏ భూముల వివాదానికి చెక్.. సబ్రిజిస్ట్రార్లకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు!
30 శాతం కమీషన్ల కోసమే 22A లిస్టులో ఎక్కువ ఆస్తుల్ని చేర్చాలని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. సీఎం నివాసమే నిషేధిత జాబితాలో ఉందని హరీష్ రావు అంటున్నారు. సో ఆందోళనలు పెరగడంతో సీఎం రేవంత్రెడ్డి సైతం ఈ అంశంపై రివ్యూ చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ పై CMO వేగంగా ఆరా తీస్తోంది. మిస్టేక్ తో చేరాయా.. లేదంటే కుట్రనా అన్నది తేలాలి. నిజాన్ని బయటపెట్టడం, ప్రైవేట్ ఆస్తులకు రక్షణ కల్పించడం, ఆగిన రిజిస్ట్రేషన్లు మళ్లీ చేయడం… ఇప్పుడు జనానికి కావాల్సింది ఇదే. అయితే ఇది ఎన్ని రోజుల్లో జరుగుతుంది. ఇది కూడా మళ్లీ క్వశ్చనే.
Also Read: ఓటీటీ అలర్ట్… ‘ప్రేమలు’ మలయాళం, హిందీ వెర్షన్లు డిలీట్… తెలుగులో ఏ ఓటీటీలో ఉందంటే ?