Vijayasai Reddy: ఒకప్పుడు వైసీపీలో జగన్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి.. ఇప్పుడు కొత్త పొలిటికల్ ప్లాట్ఫామ్ దిశగా అడుగులు వేస్తున్నారు. కొత్త పార్టీపై ప్రకటన త్వరలోనే ఉంటుందన్న ఆయన వ్యాఖ్యలు ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో హీట్ పెంచుతున్నాయ్. మరి పార్టీ పెట్టడం వెనుక అసలు స్ట్రాటజీ ఏంటి? వైసీపీకి ఆల్టర్నేట్ గా ఎదగాలన్నదే లక్ష్యమా? లేక ఏపీ పాలిటిక్స్లో కొత్త ఈక్వేషన్ క్రియేట్ చేయడమే టార్గెట్టా? ఇవన్నీ ఇప్పుడు హాట్ డిబేట్ గా మారుతున్నాయ్.
Also Read: ఐపీఎల్ డబ్బులకు కక్కుర్తి పడి, కెరీర్ నాశనం చేసుకోవద్దు..పుజారా హెచ్చరిక
విజయసాయిరెడ్డికి రాజకీయ అనుభవం ఉన్నా.. కొత్త పార్టీకి కావాల్సిన క్యాడర్, గ్రౌండ్ లెవల్ నెట్వర్క్ సాధ్యమవుతుందా అన్న ప్రశ్నలు ఉన్నాయి. జగన్ ఓట్ బ్యాంక్ను ప్రభావితం చేసే పరిస్థితి ఉందా.. లేక పర్సనల్ ఇమేజ్ వరకే పరిమితమవుతారా అన్న చర్చ కూడా జరుగుతోంది. రాజకీయాల్లో సక్సెస్ కావాలంటే సంస్థాగత బలం కీలకం. మరి ఆ బలం విజయసాయిరెడ్డి సాధిస్తారా.. కొత్త పార్టీ ప్రకటన తర్వాతే అసలు పొలిటికల్ గేమ్ ఏంటో క్లారిటీ రానుంది.
Also Read: తొలి టెస్ట్ లో పాకిస్తాన్ అంపైర్…శత్రువైనా టీమిండియాను గెలిపించాడంటూ ఆరోపణలు!