Shashi Tharoor Hails Vaibhav : జింబాబ్వే వర్సెస్ టీమిండియా (Zimbabwe vs India) మధ్య నిన్న టి20 సిరీస్ (India tour of Zimbabwe 2026) షురూ అయింది. ఈ టోర్నమెంట్ లో భాగంగా తొలి మ్యాచ్ హరారే లోని స్పోర్ట్స్ క్లబ్ (Harare Sports Club, Harare) వేదికగా జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా 7 వికెట్ల తేడాతో విక్టరీ నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్ లో జింబాబ్వే విధించిన 125 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా చేదించింది టీమిండియా. ఈ క్రమంలో వైభవ్ సూర్య వంశీ 18 బంతుల్లోనే అర్థ సెంచరీ నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. 263 స్ట్రైక్ రేట్ తో జింబాబ్వేకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో వైభవ్ సూర్య వంశీ (Vaibhav Sooryavanshi ) ఇన్నింగ్స్ పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు శశి థరూర్ (Shashi Tharoor ) కూడా ఈ అంశంపై స్పందించారు. ఒక్క అర్ధ సెంచరీతో పాకిస్తాన్ కుక్కల నోర్లు వైభవ్ మూయించాడంటూ శశి థరూర్ ప్రశంసల వర్షం కురిపించారు. సచిన్ స్థాయికి వైభవ్ ఎదగడం గ్యారెంటీ అన్నారు.
Also Read: 6, 6, 6, 6 వైభవ్ సిక్సుల వర్షం..A సింబల్ చూపిస్తూ సెలబ్రేషన్స్, టీమిండియా విజయం
అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన వైభవ్ సూర్యవంశీపై (Vaibhav Sooryavanshi ) పాకిస్తాన్ కుక్కలు మొన్నటి వరకు తెగ మొరిగాయి. ఐపీఎల్ లో అద్భుతంగా ఆడితే, ఫ్లాట్ మైదానాలు అంటూ కారు కూతలు కూసాయి. ఇంగ్లాండులో ఒకటి, రెండు మ్యాచ్ లలో విఫలమైనందుకు… అంతర్జాతీయ క్రికెట్ కు పనికిరాడు అని రెచ్చిపోయి కామెంట్ చేశారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు. ఇలా వైభవ్ ను టార్గెట్ చేసి, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారు. ఇక తాజాగా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ జింబాబ్వేపై అర్థ సెంచరీ చేశాడు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు శశి థరూర్ (Shashi Tharoor) సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్నటి వరకు వైభవ్ సూర్యవంశీని పాకిస్తాన్ కుక్కలు టార్గెట్ చేశాయని గుర్తు చేశారు. ఇక నిన్న 18 బంతుల్లో 50 పరుగులు చేసి…వాళ్ల నోర్లు మూయించాడని కౌంటర్ ఇచ్చారు. ఈ అర్ధ సెంచరీ వైభవ్ చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీలు ఇక మీడియా ముందుకు రావడం కష్టమేనన్నారు. విదేశీ గడ్డపై కూడా అర్ధ సెంచరీ చేసిన వైభవ్ కు పాకిస్తాన్ మాజీలు దండేసి దండం పెట్టాలంటూ చురకలు అంటించారు. క్రిస్ గేల్ తో వైభవ్ సూర్యవంశీని పోల్చుతున్నారు… కానీ అంతకంటే ఎక్కువగానే ఈ 15 ఏళ్ల కుర్రాడు అదరగొడుతున్నాడని వెల్లడించారు. సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా వైభవ్ బద్దలు కొట్టినట్లు గుర్తు చేశారు. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం గ్యారెంటీ అన్నారు కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు శశి థరూర్.
Also Read: ఆ పాకిస్తాన్ వెధవను వద్దని మొత్తుకున్నా, కావ్యనే వినలేదు.. SRH కోచ్ సీరియస్