E-Paper
Advertisement

IPL 2025: ఢిల్లీకి షాక్‌.. వేలంలోకి రిషబ్‌ పంత్‌ ?

IPL 2025: ఢిల్లీకి షాక్‌.. వేలంలోకి రిషబ్‌ పంత్‌ ?
Advertisement

IPL 2025: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కోసం ఇప్పటి నుంచే అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ లో (IPL) వేలానికి వస్తే తాను ఎంత ధర పలుకుతానని సోషల్ మీడియా మాధ్యమాల్లో రిషబ్ పంత్ ఓ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్ కి (IPL 2025) ముందు మెగా వేలాన్ని నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రిటెన్షన్ విధానంపై స్పష్టత ఇచ్చిన ఐపీఎల్ వర్గాలు నవంబర్ మూడవ వారంలో వేలాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ క్రమంలో రిషబ్ పంత్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారుతుంది.

Also Read: IPL 2025: అంబానీ బిగ్‌ స్కెచ్‌.. ముంబై ఇండియన్స్‌‌‌కు కొత్త కోచ్ నియామకం.!

Advertisement

ఒకవేళ నేను వేలానికి వెళితే నన్ను ఎవరైనా తీసుకుంటారా? లేదా? ఒకవేళ వేలంలో తీసుకుంటే నేను ఎంత ధరకు అమ్ముడు అవుతానంటూ తన పోస్టులో రాసుకోచ్చాడు. ప్రస్తుతం రిషభ్ పంత్ (Rishabh pant) ఢిల్లీ జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. పంత్ కోసం ఫ్రాంచైజీలు అన్నీ ఎగబడతాయన్న సంగతి తెలిసిందే. మరి ఢిల్లీ మాత్రం పంత్ ను వదిలిపెట్టే ఛాన్స్ అసలు ఉండదు. అయితే రిశబ్ సరదాగా ఈ పోస్ట్ చేసి ఉంటాడని తన అభిమానులు పేర్కొంటున్నారు. ఇక రిషబ్ పంత్ (Rishabh pant) పెట్టిన పోస్ట్ కింద కొంతమంది మీరు కనీసం 20 కోట్లు అయినా దక్కించుకుంటారని కామెంట్లు పెడుతున్నారు.

 

Advertisement

నువ్వు ఓ దిగ్గజం. నిన్ను కొనేంతస్థాయి ఎవరికి లేదంటూ బదిలిస్తున్నారు. మరోవైపు రిషబ్ పంత్ ను (Rishabh pant) కచ్చితంగా రిటైన్ చేసుకుంటామని ఢిల్లీ క్యాపిటల్స్ సహాయజమాని పార్థ్ జిందల్ ఇటీవలే వెల్లడించారు. మా జట్టులో కొంతమంది మంచి ఆటగాళ్లు ఉన్నారు. రిటెన్షన్ (Retention) విధానంపై ఇటీవల స్పష్టత వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కాబట్టి జిఎంఆర్ మా క్రికెట్ ఆఫ్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలియజేశాడు. పంత్ ను మాత్రం అసలు వదులుకోము. కచ్చితంగా రిటైన్ చేసుకుంటామనీ స్పష్టం చేశారు.

Also Read: Team India: పాకిస్తాన్ దారుణ ఓటమి.. ప్రపంచ కప్ నుంచి టీమిండియా నిష్క్రమణ

వేలంలో ఏం జరుగుతుందో చర్చల తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. మరోవైపు ఆర్సీబీలో రిషబ్ పంత్ వెళ్లడానికి సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, ఈ వార్తలను పంత్ తీవ్రంగా ఖండించాడు. ఇదంతా తప్పుడు ప్రచారం అని చెప్పాడు. 2016 నుండి రిషబ్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరపున ఆడుతున్నాడు. 2021 నుండి పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే… రిషబ్ పంత్ (Rishabh pant) రెండేళ్ల కిందట కారు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దాదాపు ఏడాదిన్నర వైద్యుల నిర్వహాణలోనే ఉన్నాడు రిషబ్ పంత్. ఆ తర్వాత కోలుకున్న రిషబ్ పంత్ (Rishabh pant) … మళ్లీ టీమిండియా లోకి రావడం జరిగింది.

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×