BigTV English
Advertisement

IPL 2025: ఢిల్లీకి షాక్‌.. వేలంలోకి రిషబ్‌ పంత్‌ ?

IPL 2025: ఢిల్లీకి షాక్‌.. వేలంలోకి రిషబ్‌ పంత్‌ ?

IPL 2025: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కోసం ఇప్పటి నుంచే అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ లో (IPL) వేలానికి వస్తే తాను ఎంత ధర పలుకుతానని సోషల్ మీడియా మాధ్యమాల్లో రిషబ్ పంత్ ఓ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్ కి (IPL 2025) ముందు మెగా వేలాన్ని నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రిటెన్షన్ విధానంపై స్పష్టత ఇచ్చిన ఐపీఎల్ వర్గాలు నవంబర్ మూడవ వారంలో వేలాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ క్రమంలో రిషబ్ పంత్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారుతుంది.


Also Read: IPL 2025: అంబానీ బిగ్‌ స్కెచ్‌.. ముంబై ఇండియన్స్‌‌‌కు కొత్త కోచ్ నియామకం.!

ఒకవేళ నేను వేలానికి వెళితే నన్ను ఎవరైనా తీసుకుంటారా? లేదా? ఒకవేళ వేలంలో తీసుకుంటే నేను ఎంత ధరకు అమ్ముడు అవుతానంటూ తన పోస్టులో రాసుకోచ్చాడు. ప్రస్తుతం రిషభ్ పంత్ (Rishabh pant) ఢిల్లీ జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. పంత్ కోసం ఫ్రాంచైజీలు అన్నీ ఎగబడతాయన్న సంగతి తెలిసిందే. మరి ఢిల్లీ మాత్రం పంత్ ను వదిలిపెట్టే ఛాన్స్ అసలు ఉండదు. అయితే రిశబ్ సరదాగా ఈ పోస్ట్ చేసి ఉంటాడని తన అభిమానులు పేర్కొంటున్నారు. ఇక రిషబ్ పంత్ (Rishabh pant) పెట్టిన పోస్ట్ కింద కొంతమంది మీరు కనీసం 20 కోట్లు అయినా దక్కించుకుంటారని కామెంట్లు పెడుతున్నారు.


 

నువ్వు ఓ దిగ్గజం. నిన్ను కొనేంతస్థాయి ఎవరికి లేదంటూ బదిలిస్తున్నారు. మరోవైపు రిషబ్ పంత్ ను (Rishabh pant) కచ్చితంగా రిటైన్ చేసుకుంటామని ఢిల్లీ క్యాపిటల్స్ సహాయజమాని పార్థ్ జిందల్ ఇటీవలే వెల్లడించారు. మా జట్టులో కొంతమంది మంచి ఆటగాళ్లు ఉన్నారు. రిటెన్షన్ (Retention) విధానంపై ఇటీవల స్పష్టత వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కాబట్టి జిఎంఆర్ మా క్రికెట్ ఆఫ్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలియజేశాడు. పంత్ ను మాత్రం అసలు వదులుకోము. కచ్చితంగా రిటైన్ చేసుకుంటామనీ స్పష్టం చేశారు.

Also Read: Team India: పాకిస్తాన్ దారుణ ఓటమి.. ప్రపంచ కప్ నుంచి టీమిండియా నిష్క్రమణ

వేలంలో ఏం జరుగుతుందో చర్చల తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. మరోవైపు ఆర్సీబీలో రిషబ్ పంత్ వెళ్లడానికి సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, ఈ వార్తలను పంత్ తీవ్రంగా ఖండించాడు. ఇదంతా తప్పుడు ప్రచారం అని చెప్పాడు. 2016 నుండి రిషబ్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరపున ఆడుతున్నాడు. 2021 నుండి పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే… రిషబ్ పంత్ (Rishabh pant) రెండేళ్ల కిందట కారు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దాదాపు ఏడాదిన్నర వైద్యుల నిర్వహాణలోనే ఉన్నాడు రిషబ్ పంత్. ఆ తర్వాత కోలుకున్న రిషబ్ పంత్ (Rishabh pant) … మళ్లీ టీమిండియా లోకి రావడం జరిగింది.

Related News

MS Dhoni: ధోని ఒకే ఒక్క ఆటోగ్రాఫ్‌..రూ.3 ల‌క్ష‌లు కాస్త, రూ.30 కోట్లు ?

RCB For Sale: RCB పేరు మార్పు, ఇక‌పై ZCB…బెంగ‌ళూరు జ‌ట్టుకు కొత్త ఓన‌ర్ ఎవ‌రంటే ?

IND VS SA: ద‌క్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్, షెడ్యూల్‌, బ‌లాబ‌లాలు ఇవే..ఉచితంగా ఎలా చూడాలంటే

Hong Kong Sixes 2025 : హార్దిక్ పాండ్యాను కాపీ కొట్టిన పాకిస్తాన్..ఛీ.. ఛీ ఎంతకు తెగించార్రా

IPL 2026: SRH జ‌ట్టులో ఫిక్సింగ్..అంబానీతో చేతులు క‌లిపి ద‌గా, కావ్యపాప స్కెచ్ చూడండి !

T20 World Cup 2026: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 షెడ్యూల్‌, వేదిక‌లు ఇవే…హైద‌రాబాద్, విశాఖ‌కు అన్యాయం ?

Cricket players : ఇప్ప‌టి క్రికెట‌ర్లు ఆ వైట్ క్రీమ్ ను ఎందుకు వాడ‌టం లేదో తెలుసా..?

IPL 2026-SSMB 29 : ఐపీఎల్ ఫ్యాన్స్ కు చిచ్చులు పెడుతున్న మహేష్-జక్కన్న, వేలం ఎప్పుడంటే?

Big Stories

×