Siddharth Mallya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… 18 సంవత్సరాల తర్వాత ఛాంపియన్ గా నిలిచింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( Royal Challengers Bangalore team). ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పైన ఏకంగా ఆరు పరుగులు తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టి… తొలిసారి ఛాంపియన్ అయింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. తొలిసారి రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్టు ఛాంపియన్ కావడంతో… భారతదేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సపోర్ట్ గా వీడియోలు అలాగే పోస్టులు షేర్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. టీమిండియా కు వరల్డ్ కప్ వచ్చిన రేంజ్ లో దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి.
ALSO READ: RCB Maiden IPL Trophy: 18 ఏళ్ల నిరీక్షణ… ఐపీఎల్ 2025 ఛాంపియన్ గా RCB… ప్రైజ్ మనీ ఎంతంటే
వెక్కివెక్కి ఏడ్చిన విజయ్ మాల్యా కుమారుడు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( Royal Challengers Bangalore team) నిలిచిన నేపథ్యంలో ఆసక్తికర సంఘటన తెరపైకి వచ్చింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించడంతో వెక్కివెక్కి ఏడ్చాడు విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ మాల్యా. అప్పట్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓనర్లుగా మాల్యా కుటుంబ ఉన్న సంగతి తెలిసిందే. అయితే అనేక స్కామ్ ల నేపథ్యంలో ఇండియా నుంచి పారిపోయింది మాల్యా కుటుంబం. అయినప్పటికీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును మాత్రం అభిమానించడం ఏమాత్రం తగ్గలేదు.
ఈ నేపథ్యంలోనే నిన్న అర్ధరాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టైటిల్ గెలవడంతో… ఆ జట్టు మాజీ ఓనర్ విజయ్ మాల్యా ( VIJAY MALLYA)కొడుకు సిద్ధార్థ మాల్యా ( SIDDARTH MALLYA) చాలా ఎమోషనల్ కావడం జరిగింది. టీవీలో మ్యాచ్ చూస్తూ చిన్నపిల్లాడిలా వెక్కివెక్కి ఏడ్చాడు సిద్ధార్థ మాల్యా. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ట్రోఫీ సాధించగానే ఆఖరికి కప్పు కొట్టామంటూ… చిన్న పిల్లాడిలా ఏడ్చాడు సిద్ధార్థ మాల్యా. దీంతో సిద్ధార్థ మాల్యా ఏడ్చిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బెంగళూరు విజయంపై విజయ్ మాల్యా పోస్ట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament 2025) నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఛాంపియన్గా నిలిచిన సందర్భంగా విజయ్ మాల్య కూడా పోస్ట్ పెట్టారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ ఓనర్ అయిన విజయ్ మాల్యా ఆసక్తికర పోస్ట్ పెట్టి వైరల్ గా మారారు. టైటిల్ గెలిచి నా కల నెరవేర్చిన రాయల్ చాలెంజ్ బెంగళూరు జట్టుకు కృతజ్ఞతలు… 18 సంవత్సరాల తర్వాత కళ నెరవేర్చారు అంటూ ఎమోషనల్ అయ్యారు విజయ్ మాల్యా.
ALSO READ: Anushka Sharma-Virat Kohli: 18 ఏళ్ళ తర్వాత కప్.. అనుష్కకు టైట్ హాగ్ ఇచ్చి.. ఏడ్చేసిన కోహ్లీ