BigTV English
Advertisement

MI VS GT: రోహిత్ శర్మ క్లీన్-బౌల్డ్.. ర్యాగింగ్ చేసిన సిరాజ్…!

MI VS GT: రోహిత్ శర్మ క్లీన్-బౌల్డ్.. ర్యాగింగ్ చేసిన సిరాజ్…!

MI VS GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా… ఇవాళ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య 9వ మ్యాచ్ జరుగుతుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ప్లేయర్ రోహిత్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. 8 పరుగులకే అవుట్ అయిన రోహిత్ శర్మ.. తన అభిమానులను మరోసారి నిరాశపరిచాడు. అయితే… రోహిత్ శర్మ నార్మల్గా అవుట్ అయితే పర్వాలేదు. కానీ గుజరాత్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నాలుగు బంతుల్లో 8 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. సిరాజ్ వేసిన అద్భుతమైన బంతికి దొరికిపోయాడు.


Also Read: Sehwag on MS Dhoni: స్టంపింగ్ చేయడంలో ధోనిని కొట్టేవాడు లేడు.. ఫిదా అయిపోయిన సెహ్వాగ్

రోహిత్ శర్మ బ్యాట్ టచ్ చేసే లోపే… బాల్ వికెట్లను తగిలేసింది. దీంతో ఆ వికెట్ చూసిన క్రీడా అభిమానులు అందరూ… షాక్ అయ్యారు. అటు రోహిత్ శర్మ కూడా దిమ్మ తిరిగిపోయినట్లుగా చూస్తూ… పెవిలియన్ దారిపట్టాడు. అయితే రోహిత్ శర్మ వికెట్ తీసిన తర్వాత మహమ్మద్ సిరాజ్… సెలబ్రేషన్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఏదో వరల్డ్ కప్ సాధించిన రేంజ్ లో మహమ్మద్ సిరాజ్… ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ప్రారంభాని కంటే ముందు ఛాంపియన్స్ ట్రోఫీ ఆడింది టీమిండియా. ఆ సమయంలో మహమ్మద్ సిరాజుకు చాన్సు రాలేదు. దీనిపై రోహిత్ శర్మ మాట్లాడారు.


Also Read: Csk fans: చెన్నై కెప్టెన్ రుతురాజుపై దారుణంగా ట్రోలింగ్… చెత్త నిర్ణయాలు అంటూ!

మహమ్మద్ సిరాజ్ పెద్దగా బౌలింగ్ చేయడం.. అతని దగ్గర సత్తా తక్కువ ఉంది అన్న రేంజిలో… సమాధానమిచ్చాడు రోహిత్ శర్మ. అయితే ఇప్పుడు రోహిత్ శర్మ వికెట్.. మహమ్మద్ సిరాజ్ తీయడంతో… సిరాజ్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన కామెంట్లకు తన బంతితో సమాధానం మహమ్మద్ సిరాజ్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి రోహిత్ శర్మ వికెట్ను ( Rohit Sharma) మహమ్మద్ సిరాజ్ తీయడం హాట్ టాపిక్ అయింది. రోహిత్ శర్మ వికెట్ తో పాటు రైన్ రికల్టన్ వికెట్ కూడా తీశాడు మహమ్మద్ సిరాజ్. దీంతో ముంబై ఇండియన్స్ కష్టాల్లో పడింది.

తిలక్ వర్మ కూడా 36 బంతులో 39 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా అలాగే సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా… ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ టైటాన్స్ మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఈ తరుణంలోనే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయిన గుజరాత్ టైటాన్స్…. 176 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ ఒక్కడే 41 బంతుల్లో 63 పరుగులు చేసి దుమ్ము లేపాడు.

Related News

Anushka-Kohli: కోహ్లీ – అనుష్క శర్మ విడాకులు ?సోష‌ల్ మీడియాలో దారుణంగా పోస్టులు

WPL Retention 2026 : రిటైన్ లిస్టు ఇదే..WPL 2026 టోర్న‌మెంట్ షెడ్యూల్ ఇదే..!

IND VS AUS 4th T20I : వాషి యో వాషి..3 వికెట్లు తీసిన వాషింగ్ట‌న్‌, కంగారుల‌పై టీమిండియా విజ‌యం

Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Tata Motors: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్ల‌కు టాటా బంప‌ర్ ఆఫ‌ర్‌

PV Sindhu: బోల్డ్ అందాలతో రెచ్చిపోయిన PV సింధు.. వెకేషన్ లో భర్తతో రొమాన్స్

IND VS AUS, 4th T20I: టాస్ ఓడిన టీమిండియా..మ్యాక్స్‌వెల్ తో పాటు 4 గురు కొత్త‌ ప్లేయ‌ర్లు వ‌చ్చేస్తున్నారు

Harleen Deol: మోడీ సార్‌.. ఎందుకు ఇంత హ్యాండ్స‌మ్ గా ఉంటారు? హర్లీన్ డియోల్ ఫ‌న్నీ క్వ‌శ్చ‌న్‌

Big Stories

×