BigTV English

MI VS GT: రోహిత్ శర్మ క్లీన్-బౌల్డ్.. ర్యాగింగ్ చేసిన సిరాజ్…!

MI VS GT: రోహిత్ శర్మ క్లీన్-బౌల్డ్.. ర్యాగింగ్ చేసిన సిరాజ్…!

MI VS GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా… ఇవాళ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య 9వ మ్యాచ్ జరుగుతుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ప్లేయర్ రోహిత్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. 8 పరుగులకే అవుట్ అయిన రోహిత్ శర్మ.. తన అభిమానులను మరోసారి నిరాశపరిచాడు. అయితే… రోహిత్ శర్మ నార్మల్గా అవుట్ అయితే పర్వాలేదు. కానీ గుజరాత్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నాలుగు బంతుల్లో 8 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. సిరాజ్ వేసిన అద్భుతమైన బంతికి దొరికిపోయాడు.


Also Read: Sehwag on MS Dhoni: స్టంపింగ్ చేయడంలో ధోనిని కొట్టేవాడు లేడు.. ఫిదా అయిపోయిన సెహ్వాగ్

రోహిత్ శర్మ బ్యాట్ టచ్ చేసే లోపే… బాల్ వికెట్లను తగిలేసింది. దీంతో ఆ వికెట్ చూసిన క్రీడా అభిమానులు అందరూ… షాక్ అయ్యారు. అటు రోహిత్ శర్మ కూడా దిమ్మ తిరిగిపోయినట్లుగా చూస్తూ… పెవిలియన్ దారిపట్టాడు. అయితే రోహిత్ శర్మ వికెట్ తీసిన తర్వాత మహమ్మద్ సిరాజ్… సెలబ్రేషన్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఏదో వరల్డ్ కప్ సాధించిన రేంజ్ లో మహమ్మద్ సిరాజ్… ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ప్రారంభాని కంటే ముందు ఛాంపియన్స్ ట్రోఫీ ఆడింది టీమిండియా. ఆ సమయంలో మహమ్మద్ సిరాజుకు చాన్సు రాలేదు. దీనిపై రోహిత్ శర్మ మాట్లాడారు.


Also Read: Csk fans: చెన్నై కెప్టెన్ రుతురాజుపై దారుణంగా ట్రోలింగ్… చెత్త నిర్ణయాలు అంటూ!

మహమ్మద్ సిరాజ్ పెద్దగా బౌలింగ్ చేయడం.. అతని దగ్గర సత్తా తక్కువ ఉంది అన్న రేంజిలో… సమాధానమిచ్చాడు రోహిత్ శర్మ. అయితే ఇప్పుడు రోహిత్ శర్మ వికెట్.. మహమ్మద్ సిరాజ్ తీయడంతో… సిరాజ్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన కామెంట్లకు తన బంతితో సమాధానం మహమ్మద్ సిరాజ్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి రోహిత్ శర్మ వికెట్ను ( Rohit Sharma) మహమ్మద్ సిరాజ్ తీయడం హాట్ టాపిక్ అయింది. రోహిత్ శర్మ వికెట్ తో పాటు రైన్ రికల్టన్ వికెట్ కూడా తీశాడు మహమ్మద్ సిరాజ్. దీంతో ముంబై ఇండియన్స్ కష్టాల్లో పడింది.

తిలక్ వర్మ కూడా 36 బంతులో 39 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా అలాగే సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా… ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ టైటాన్స్ మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఈ తరుణంలోనే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయిన గుజరాత్ టైటాన్స్…. 176 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ ఒక్కడే 41 బంతుల్లో 63 పరుగులు చేసి దుమ్ము లేపాడు.

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×