Anchor breaks TV: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament )
చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో.. లక్నో సూపర్ జెంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కు ( Lucknow Super Giants captain Rishabh Pant) ఊహించని షాక్ తగిలింది. లక్నో సూపర్ జెంట్స్ కెప్టెన్ గా రిషబ్ పంత్ సరిగ్గా ఆడటం లేదని.. ఓ టీవీ ప్యానెల్ లిస్టు రెచ్చిపోయాడు. కోపంతో ఊగిపోయిన సదరు ప్యానలిస్టు… టీవీ బద్దలు కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గురువారం రోజున సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ ( Sunrisers Hyderabad vs Lucknow Super Giants) జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.
Also Read: Shardul Thakur: పడి లేచిన కెరటం… Un sold ప్లేయర్ నుంచి తోపు ఆటగాడిగా రికార్డ్ !
ఈ మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓడిపోగా లక్నో ఐదు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ కెప్టెన్సీ లో ఉన్న లక్నో గెలిచినప్పటికీ… ఓ ప్యానలిస్టు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశాడు. లక్నో జట్టుకు సరైన కెప్టెన్ లేడని… రిషబ్ పంత్ కు అసలు కెప్టెన్సీ రాదని మండిపడ్డాడు సదరు ప్యానలిస్టు. తాజాగా స్పోర్ట్స్ తక్ ఐపీఎల్ పైన ఓ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా బాలాజీ అనే ప్యానలిస్టు మాట్లాడారు. మాట్లాడుతూనే కోపానికి గురయ్యారు బాలాజీ.
ముఖ్యంగా లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ పేరు రాగానే… కోపంతో ఊగిపోయారు. వెంటనే తన వెనుక ఉన్న టీవీని బద్దలు కొట్టారు బాలాజీ. రిషబ్ పంత్ చెత్త కెప్టెన్ అంటూ మండిపడ్డారు. అలాంటి వాన్ని జట్టుకు కెప్టెన్ చేయడం తప్పని… ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు ప్యానలిస్ట్ బాలాజీ. దీనికి సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ వీడియోని చూసిన రిషబ్ పంత్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. రిషబ్ పంత్ జట్టును గెలిపించడానికి… గెలిచిన తర్వాత కూడా అతనిపై పడి ఏడవడం ఏంటని మండిపడుతున్నారు.
Also Read: Nitish Kumar Reddy: కట్టలు తెంచుకున్న కోపం.. హెల్మెట్ విసిరేసిన నితీష్.. వీడియో వైరల్!
ఇది ఇలా ఉండగా… నిన్న సన్రైజర్స్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ ( Sunrisers vs Lucknow Super Giants )
జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో నికోలస్ పూరన్, మార్ష్ అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో… లక్నో సూపర్ జెంట్స్ విజయం సాధించింది. విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చేతిలో ఓడిపోయిన లక్నో సూపర్ జెంట్స్… నిన్నటి మ్యాచ్ లో మాత్రం పుంజుకుంది. ఈ టోర్నమెంట్లో మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. అటు సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం మొదటి ఓటమి మూటగట్టుకుంది.
పంత్ కెప్టెన్సీపై కోపం.. టీవీ పగులగొట్టిన యాంకర్
నిన్నటి IPL మ్యాచ్ అనంతరం 'స్పోర్ట్స్తక్' నిర్వహించిన క్రీడా చర్చలో రిషబ్ పంత్పై కోపంతో బాబాజీ అనే ప్యానెలిస్ట్ టీవీని పగులగొట్టారు. 'LSGకి ఇలాంటి కెప్టెన్ అసలు అక్కర్లేదు. అలాంటి మనిషిని కెప్టెన్గా పెట్టుకుని ఎలా ఆడతాం?… pic.twitter.com/UwbVUlnGfE
— ChotaNews App (@ChotaNewsApp) March 28, 2025