E-Paper
Advertisement

గుట్టుచప్పుడు కాకుండా.. ఇంట్లోనే అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ కలకలం

గుట్టుచప్పుడు కాకుండా.. ఇంట్లోనే అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ కలకలం
Advertisement

LPG Refilling: స్వేచ్ఛ బ్యూరో: ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని రాజబొల్లారం గ్రామం ఘన్‌పూర్‌ ఎక్స్‌రోడ్‌ సమీపంలో అక్రమంగా నిర్వహిస్తున్న ఎల్‌పీజీ గ్యాస్‌ రీఫిల్లింగ్‌ కేంద్రంపై మేడ్చల్‌ ఎస్‌ఓటీ అధికారులు గురువారం రాత్రి దాడి చేశారు. ఈ సందర్భంగా విజయేందర్‌ గుప్తా, సన్నీ గుప్తా, మనీష్‌ గుప్తా, విశాల్‌ గుప్తాలను అదుపులోకి తీసుకున్నారు. ఇంటి యజమాని రాజేష్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

గ్యాస్‌ రీఫిల్లింగ్‌..

దాడిలో పెద్ద సంఖ్యలో డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్లు, ఏజిస్‌ ప్యూర్‌గ్యాస్‌కు చెందిన 15 కిలోల సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. గ్యాస్‌ రీఫిల్లింగ్‌కు వినియోగిస్తున్న 4 మోటార్లు, వైర్‌ కనెక్షన్లు, వెయింగ్‌ మెషిన్‌, హీట్‌ మెషిన్‌ కూడా పట్టుబడ్డాయి.అలాగే భారత్‌గ్యాస్‌ హోలోగ్రామ్‌ స్టిక్కర్లు 50, హెచ్‌పీ హోలోగ్రామ్‌ స్టిక్కర్లు 47, ఇండియన్‌ గ్యాస్‌ హోలోగ్రామ్‌ స్టిక్కర్లు 27, ఖాళీ 47 కిలోల సిలిండర్లు 47, ఖాళీ 34 కిలోల సిలిండర్లు 34, ఒక అశోక్‌ లేలాండ్‌ వాహనం, మూడు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా గ్యాస్‌ రీఫిల్లింగ్‌ చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Also read: అతి తక్కువ ధరలో.. స్మార్ట్ టీవీ! హోమ్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ గ్యారంటీ

Tags

Related News

మీరాలం చెరువు పనులపై సీఎం రేవంత్ ఆకస్మిత తనిఖీలు, అధికారులు పరుగో పరుగు

నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలంగాణ వాసులకు బిగ్ అలర్ట్!

ట్యాంక్​ బండ్‌లో దూకిన సూడాన్ దేశస్తుడు.. కానీ చివరికి..?

కూతురు మరణాన్ని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య!

ఈనెల 30న తెలంగాణకు సునీల్ బన్సల్.. ఆ అంశాలపై కీలక చర్చ!

దేశానికే ఆదర్శంగా తెలంగాణ మహిళా సంఘాలు.. ఢిల్లీ వేదికగా జాతీయ అవార్డు!

కేఆర్ఎంబీ అంటే లెక్క లేదు.. త్రిసభ్య కమిటీ అంటే విలువ లేదు.. ఏపీపై హరీశ్ రావు ఫైర్

Big Stories

Advertisement
×