E-Paper
Advertisement

Sunrisers Hyderabad: కావ్యాపాప భారీ డీలింగ్‌.. ఈ సారి ఏకంగా రూ.1092 కోట్లు !

Sunrisers Hyderabad: కావ్యాపాప భారీ డీలింగ్‌.. ఈ సారి ఏకంగా రూ.1092 కోట్లు !
Advertisement

Sunrisers Hyderabad: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} ఫ్రాంచైజీలు ప్రస్తుతం ఎక్కువగా 100 లీగ్ లపై ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే ముంబై, లక్నో సూపర్ జెయింట్స్ ఈ హండ్రెడ్ లీగ్ లోకి ఎంట్రీ ఇవ్వగా.. తాజాగా మరో ఐపీఎల్ టీమ్ కూడా ఇందులోకి అడుగు పెట్టింది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు {ఈసీబీ} కి చెందిన 100 లీగ్ లో నార్తర్న్ సూపర్ చార్జర్స్ లో సన్రైజర్స్ హైదరాబాద్ {Sunrisers Hyderabad} భాగస్వామ్యం అయ్యింది.

Also Read: Ind vs Eng 1st ODI: నేటి నుంచే వన్డే సిరీస్‌..టైమింగ్స్‌ ఇవే..ఉచితంగా ఇలా చూడండి ?

Advertisement

యార్క్ షైర్ కౌంటీ కేంద్రంగా ఉన్న నర్తర్న్ సూపర్ చార్జర్స్ టీమ్ లో చెన్నైకి చెందిన సన్ గ్రూప్ 49% వాటాను కొనుగోలు చేసింది. దీని విలువ సుమారు 100 మిలియన్ బ్రిటన్ పౌండ్లు {సుమారు రూ.1092 కోట్లు} గా తెలుస్తోంది. బుధవారం రోజు కొనసాగిన అమ్మకంలో సన్ గ్రూప్ అత్యధిక మొత్తానికి బిడ్ చేసింది. సన్ గ్రూప్ {Sunrisers Hyderabad} కి ఐపీఎల్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ తో పాటు సౌత్ ఆఫ్రికా టీ-20 లీగ్ లో ఈస్టర్న్ కేప్ టీమ్ కూడా ఉంది.

ఇప్పుడు ఆ గ్రూప్ తమ జాబితాలో మూడు టీమ్ ని కూడా చేర్చింది. అంతేకాదు 100 లో టీమ్ వాటాను కొనుగోలు చేసిన మూడవ ఐపీఎల్ టీమ్ యాజమాన్యంగా సన్ గ్రూప్ నిలిచింది. ఇక ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ {Sunrisers Hyderabad} కి సంబంధించిన వ్యవహారాలను కావ్య మారన్ {kavya maran} చూసుకుంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్టులో వాటాను కొనుగోలు చేయగా.. అంతకుముందు ముంబై ఇండియన్స్ {mumbai indians} కి చెందిన రిలయన్స్ యాజమాన్యం ఓవల్ ఇన్వెన్షిబుల్ జట్టులో వాటాను దక్కించుకుంది.

Advertisement

ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ {Sunrisers Hyderabad} యాజమాన్యం నార్తర్న్ సూపర్ చార్జర్స్ లో భాగస్వామ్యం అయింది. ఇదిలా ఉంటే.. సౌత్ ఆఫ్రికా టీ-20 లీగ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ మరోసారి టైటిల్ రేసులో నిలిచింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో జోబర్గ్ సూపర్ కింగ్స్ ని చిత్తు చేసి.. క్వాలిఫైయర్ 2 కి అర్హత సాధించింది.

Also Read:  Champions Trophy 2025: శిఖర్ ధావన్ లేకపోవడం టీమిండియాకు ఎంత నష్టమో తెలుసా.. కోహ్లీ, రోహిత్ కూడా పనికిరారు !

కాగా 2023లో మొదలైన సౌత్ ఆఫ్రికా టీ-20 లీగ్ లో ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్రైజర్స్ హైదరాబాద్ {Sunrisers Hyderabad} కి చెందిన ఈస్టర్ను కేప్ జట్టు అరంగేట్ర ఛాంపియన్ గా నిలిచింది. గత సంవత్సరం కూడా మార్క్రమ్ కెప్టెన్సీ లోని ఈ జట్టు విజేతగా అవతరించి వరుసగా రెండవసారి టైటిల్ ని గెలుచుకుంది. ఇప్పుడు ముచ్చటగా మూడవసారి కూడా టైటిల్ ని గెలుచుకునేందుకు సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ టైటిల్ రేసులో నిలిచింది.

Related News

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

Big Stories

Advertisement
×