Team India T20I Captaincy: టీమిండియా జట్టులో ( Team India) పెను ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో నెలకొంటున్నాయి. ఇటీవల కాలంలోనే సూర్య కుమార్ యాదవ్ పై ( Surya Kumar Yadav) వేటు వేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి ( BCCI).. శ్రేయస్ అయ్యర్ కు ( Shreyas Iyer) కెప్టెన్సీ ఇచ్చింది. ఈ ప్రకటన వెలువడి నెల రోజులు పూర్తికాలేదు.. కానీ ఇంతలోనే అతడి పై మరో కుట్ర జరుగుతోంది. శ్రేయస్ అయ్యర్ ను దింపేసి.. టి20 కెప్టెన్ గా గిల్ ను నియామకం చేయాలని గౌతమ్ గంభీర్ అలాగే అజిత్ అగార్కర్ కుట్రలు పన్నుతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇటీవల అయ్యర్ కు కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చింది తాత్కాలికంగానే అని సమాచారం. ఏషియన్ గేమ్స్ తర్వాత మళ్లీ గిల్ ( Shubman Gill).. టి20 కెప్టెన్ గా ( Team India T20I Captaincy) కూడా బాధ్యతలు చేపట్టబోతున్నాడట. ఆ దిశగా గౌతమ్ గంభీర్ (Gautam Gambhir), చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ( Ajit Agarkar) ఇద్దరూ ఇప్పటికే ప్లాన్స్ సిద్ధం చేసినట్లు సమాచారం అందుతోంది.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ గెలిపించిన సూర్య కుమార్ యాదవ్ పై వేటు వేసిన బిసిసిఐ.. శ్రేయస్ అయ్యర్ కు కెప్టెన్సీ ఇచ్చి ఇచ్చింది. అయితే ఐర్లాండ్, ఇంగ్లాండ్ అలాగే ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ లో భాగంగా జరిగే టి20 మ్యాచ్ లకు శ్రేయస్ అయ్యర్ ను కెప్టెన్ గా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఎప్పటికీ అలాగే అయ్యర్ కెప్టెన్ గా కొనసాగుతాడని అందరూ అనుకున్నారు. కానీ ఇంతలోనే గౌతమ్ గంభీర్, అజిత్ అగర్కర్ ఇద్దరు కుట్రలకు తెర లేపారట. ఏషియన్ గేమ్స్ అయిన తర్వాత మళ్లీ గిల్ కు టి20 కెప్టెన్సీ కూడా ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. ఈ మేరకు ఇప్పటికే అయ్యర్ కు కూడా ఆదేశాలు వెళ్లినట్లు చెబుతున్నారు.
2027 వన్డే వరల్డ్ కప్ పూర్తయిన తర్వాత టి20 కెప్టెన్ గా గిల్ బాధ్యతలు తీసుకోబోతున్నట్లు చెబుతున్నారు. అప్పటివరకు టి20 తాత్కాలిక కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ కొనసాగుతాడట. వన్డే వరల్డ్ కప్ పైన గిల్ ఫోకస్ చేసేందుకు గాను.. అయ్యర్ కు తాత్కాలిక కెప్టెన్సీ ఇచ్చినట్లు ఇప్పుడు ప్రచారం జోరుగా సాగుతోంది. అంతేకానీ అయ్యర్ పై ప్రేమతో కెప్టెన్సీ ఇవ్వలేదని చర్చ జరుగుతోంది. దీనిపై అయ్యర్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు.