E-Paper
Advertisement

తెలంగాణ జైళ్ల చరిత్రలోనే తొలిసారి.. 78 మంది ఖైదీలు ‘పది’ పాస్!

తెలంగాణ జైళ్ల చరిత్రలోనే తొలిసారి.. 78 మంది ఖైదీలు ‘పది’ పాస్!
Advertisement

Prisoners Education: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ జైళ్ల చరిత్రలో తొలిసారిగా ఎన్‌ఐఓఎస్‌ (NIOS) ద్వారా 78 మంది ఖైదీలు పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఖైదీల్లో విద్యాభ్యాసాన్ని, పునరావాసాన్ని ప్రోత్సహించేందుకు జైళ్ల శాఖ చేపట్టిన కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చింది.

78 మందికి ప్రత్యేక రిమిషన్

Advertisement

చర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి 56 మంది, నిజామాబాద్‌ జైలు నుంచి 15 మంది, హైదరాబాద్‌ ప్రత్యేక మహిళా కారాగారం నుంచి ఏడుగురు పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. ఈ సందర్భంగా జైళ్ల శాఖ డీజీ డా. సౌమ్య మిశ్రా ఉత్తీర్ణులైన ఖైదీలకు ధ్రువపత్రాలను అందజేసి అభినందించారు. విద్యపై ఖైదీలు చూపిన పట్టుదలకు గుర్తింపుగా 78 మందికి ప్రత్యేక రిమిషన్‌ ప్రకటించారు.

ధ్రువపత్రాలు అందజేసిన డీజీ

Advertisement

శిక్ష అనుభవిస్తున్నప్పటికీ విద్యను కొనసాగించి విజయాన్ని సాధించడం అభినందనీయమని డీజీ పేర్కొన్నారు. ఉత్తీర్ణులైన ఖైదీలు తదుపరి 10 +2, డిగ్రీ, ఐటీఐ తదితర వృత్తి విద్యా కోర్సులు కొనసాగించేలా ప్రోత్సహిస్తామని డీజీ తెలిపారు. విద్య ద్వారా జీవితంలో సానుకూల మార్పు తీసుకువచ్చి, భవిష్యత్తులో స్వయం ఆధారితంగా ఎదగాలని సూచించారు. ఖైదీలలో పరివర్తన తీసుకురావడంలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని, ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని జైళ్ల శాఖ అధికారులు తెలిపారు.

Also Read: పార్టీల్లో SIR టెన్షన్.. GHMC ఎన్నికలపై ప్రభావం ఉంటుందా..!

Tags

Related News

తెలంగాణ యువతకు ఆర్మీ అవకాశాలు.. సదరన్ కమాండ్ అధికారులతో సీఎం రేవంత్ కీలక భేటీ!

ఆన్‌లైన్‌లో అప్లై చేసినా ఆఫీసుకు వెళ్లాల్సిందేనా? RTOలో అసలేం జరుగుతోంది!

కేపీహెచ్‌బీలో ఇందిరమ్మ టవర్స్‌కు రేపే శంకుస్థాపన.. డిఫాల్ట్ మిల్లర్లపై సీఎం రేవంత్ ఫైర్!

కొంపల్లిలో పేకాట స్థావరంపై SOT దాడి.. మాజీ చైర్మన్‌తో సహా 8 మంది అరెస్ట్!

దేవరయాంజాల్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 6 గంటలుగా ఎగిసిపడుతున్న మంటలు, కోట్ల ఆస్తి నష్టం!

పింఛన్‌దారులకు శుభవార్త! పాత నిబంధనలతోనే కొత్త పింఛన్లు..

హైటెక్ సిటీలో భారీ మాల్.. షాపింగ్, థియేటర్లు, రెస్టారెంట్లు అన్నీ ఒకే చోట.. సరికొత్త వీకెండ్ డెస్టినేషన్!

Big Stories

Advertisement
×