E-Paper
Advertisement

KTR: పట్టపగలు ఎమ్మెల్యేపై హత్యాయత్నమా? కేటీఆర్ ఫైర్

KTR: పట్టపగలు ఎమ్మెల్యేపై హత్యాయత్నమా? కేటీఆర్ ఫైర్
Advertisement

KTR Fires on Congress Government: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. పట్టపగలు ఎమ్మెల్యేపై హత్యాయత్నమా? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఫ్యాక్షన్, రౌడీ రాజకీయాలకు అడ్డాగా మారుస్తుంటే బాధేస్తుందన్నారు. ఒక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని గృహ నిర్భంధంలో ఉంచి అరికెపూడి గాంధీ గూండాలతో దాడి చేయిస్తారా అని ప్రశ్నించారు.

మన రాష్ట్రం ఎటు పోతుందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఎమ్మెల్యేలకు సైతం రక్షణ లేకుండా పోతుందన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కౌశిక్ రెడ్డి న్యాయపరంగా పోరాడుతున్నారన్నారు. అయితే ఆయనపై టార్గెట్ చేస్తారా అని ప్రశ్నించారు.

Advertisement

కావాలనే కౌశిక్ రెడ్డిపై దాడి చేయించారని, ఈ దాడి వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారన్నారు. ఈ దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఉడుత ఊపుల దాడులకు బీఆర్ఎస్ నాయకులు బెదరని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ఇంతకుమించి ఘటనలు ఎదుర్కొంటారని హెచ్చరించారు.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×