E-Paper
Advertisement

khammam : చికెన్ వ్యర్థాల సేకరణ.. రికార్డు స్థాయిలో వేలం..

khammam : చికెన్ వ్యర్థాల సేకరణ.. రికార్డు స్థాయిలో వేలం..
Advertisement

khammam : ఖమ్మం కార్పొరేషన్ అధికారులు నగరంలోని చికెన్ వ్యర్థాల సేకరణకు వేలం వేశారు. రికార్డు స్థాయిలో చికెన్ వేస్టేజీ సేకరణ గద్వాల ప్రాంత వ్యక్తి దక్కించుకున్నారు . జోగులాంబ జిల్లా గద్వాలకు చెందిన బాలరాజు అనే వ్యక్తి ఏకంగా కోటి 55 లక్షల 60 వేలకు టెండర్ ను దక్కించుకున్నారు.

గతంలో ఈ టెండర్‌ను 44 లక్షల 44 వేలకు ఒక కాంట్రాక్టర్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం మూడురెట్లు అదనంగా ధర పలికింది. ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహించగా.. ఆరుగురు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగవేలంలో రాయల్టీ పాటగా 40 లక్షలు నిర్ణయించారు.

Advertisement

జోగులాంబ గద్వాల జిల్లా.. గద్వాలకు చెందిన బాలరాజు కోటి 55లక్షల 60వేలకు పాటను దక్కించుకున్నారు. టెండర్ పొందిన కాంట్రాక్టర్ ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని 200 పైగా ఉన్న చికెన్ దుకాణాల నుంచి వ్యర్ధాలను సేకరిస్తారు. వాటిని సాంకేతిక పద్ధతిలో పొడిగా మార్చి చేపల దాణాగా తయారు చేస్తారు. అనంతరం చేపల చెరువుల యాజమానులకు అమ్ముతారు. ఇలా చేసినందుకు నగరపాలక సంస్థకు రాయల్టీ చెల్లించాలి. రాయల్టీ నిమిత్తం టెండర్లను ఆహ్వానించి బహిరంగ వేలం నిర్వహించగా ఊహించినదానికంటే ఎక్కువ రాయల్టీ లభించింది.

Related News

KTR: ఇది కాలం తెచ్చింది కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు..కేటీఆర్ షాకింగ్ కామెంట్స్!

కొట్టుకుపోయిన జాతీయ రహదారి.. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ రాకపోకలు బంద్!

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆరోగ్యం మాటేంటి? షాకింగ్ విషయాలు, బిగ్ టీవీతో డాక్టర్ రవిశంకర్

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

Big Stories

Advertisement
×