E-Paper
Advertisement

Banakacharla Project: హరీష్ రావు ఫేక్ మాటలు.. బనకచర్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం: మంత్రి ఉత్తమ్

Banakacharla Project: హరీష్ రావు ఫేక్ మాటలు.. బనకచర్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం: మంత్రి ఉత్తమ్

బనకచర్ల ప్రాజెక్టు అంశంపై తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం ముదిరింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన విమర్శలకు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీటుగా సమాధానమిచ్చారు. ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బనకచర్ల వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పనుల వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందని హరీష్ రావు మండిపడ్డారు. ఈ ముప్పును బీఆర్ఎస్ పార్టీ ముందుగానే గుర్తించి రణభేరి మోగించిందని ఆయన గుర్తు చేశారు. ‘మేము ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి, హెచ్చరికలు జారీ చేసినా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో చలనం లేదు. బీఆర్ఎస్ బల్లెం పెట్టి పొడిచినా ప్రభుత్వం నిద్రలేవడం లేదు’ అని ఆయన ఎద్దేవా చేశారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీరుపై స్పందిస్తూ, తాను ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారీ మంత్రి గారు పాత తేదీలతో లేఖలు రాస్తూ కాలక్షేపం చేస్తున్నారని హరీష్ రావు విమర్శించిన విషయం తెలిసిందే… కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనం వల్లే ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుల విషయంలో దూకుడుగా వెళ్తోందని, తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు.

హరీష్ రావు ఆరోపణలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. సాగునీటి అంశాలపై హరీష్ రావు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పోరాటం చేస్తూనే ఉందని స్పష్టం చేశారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా.. చట్టపరంగా కూడా చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు.

‘బనకచర్ల అంశంపై మేము ఇప్పటికే సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాం. ఈ పిటిషన్ జనవరి 5వ తేదీన విచారణకు రానుంది’ అని మంత్రి వెల్లడించారు. తెలంగాణ హక్కులను కాపాడటంలో రాజీ పడే ప్రసక్తే లేదని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. హరీష్ రావు కేవలం రాజకీయ లబ్ధి కోసమే అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు.

బనకచర్ల వివాదం ఇప్పుడు అటు రాజకీయంగా.. ఇటు న్యాయపరంగా కీలక మలుపు తిరిగింది. ఒకవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంటే, మరోవైపు ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా ఏపీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని చూస్తోంది. జనవరి 5న సుప్రీంకోర్టులో జరగబోయే విచారణ ఈ వివాదంలో అత్యంత కీలకం కానుంది.

ALSO READ: Hyderabad Metro Rail: అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు.. న్యూ ఇయర్ వేళ సమయాల్లో మార్పులు

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×