E-Paper
Advertisement

Bandi Sanjay : బండి సంజయ్ కు బెయిల్.. షరతులు ఇవే..!

Bandi Sanjay : బండి సంజయ్ కు బెయిల్.. షరతులు ఇవే..!
Advertisement

Bandi Sanjay : ఉత్కంఠ వీడింది. పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు బెయిల్‌ మంజూరైంది. ఆయన తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్ పై గురువారం హనుమకొండ జిల్లా ప్రధాన మున్సిఫ్‌ మేజిస్ట్రేట్ రాపోలు అనిత సుదీర్ఘ విచారణ చేపట్టారు. రాత్రి 10 గంటల సమయంలో బెయిల్‌ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చారు. రూ.20 వేల సొంత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించారు.

బండి సంజయ్ కు పలు షరతులు విధించారు. దేశం దాటి వెళ్లొద్దని ఆదేశించారు. సాక్షులను ప్రభావితం చేసే విధంగా ప్రవర్తించవద్దని నిర్దేశించారు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు సహకరించాలని కోరారు. బెయిల్‌ మంజూరవడంతో సంజయ్‌ శుక్రవారం ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు.

Advertisement

మరోవైపు నిందితులు బండి సంజయ్‌, బూర ప్రశాంత్‌, మహేశ్‌లను విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కమలాపూర్‌ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై వాదోపవాదాలు కొనసాగాయి. నిందితులకు కస్టడీ పిటిషన్‌ సమాచారం ఇవ్వాలని పోలీసులను ఆదేశిస్తూ మేజిస్ట్రేట్‌ విచారణను సోమవారానికి వాయిదా వేశారు. బండి సంజయ్‌ బుధవారమే దాఖలు చేసుకున్న బెయిల్‌ దరఖాస్తు గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు బెంచ్‌పైకి వచ్చింది.

రాత్రి 10 గంటల వరకు నిర్ణయం వెలువడకపోవడం, పోలీసులు కస్టడీ కోరుతూ దరఖాస్తు చేసిన పరిణామాలను బట్టి గురువారం బెయిల్‌ రాదనే అంతా భావించారు. దాదాపు 8 గంటల వాదోపవాదాల తర్వాత మేజిస్ట్రేట్‌ షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు. కోర్టు ఆదేశాలతో ఇద్దరు వ్యక్తులు పూచీకత్తు సమర్పించడంతో బండి సంజయ్‌ను విడుదల చేయాలని కరీంనగర్‌ జైలు పర్యవేక్షకుడికి మేజిస్ట్రేట్‌ ఆదేశాలు జారీ చేశారు.

Related News

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×