Bandi Sanjay: సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గేపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. వందేమాతరం గీతాన్ని సోనియా, ఖర్గే అవమానించడం దేశానికే సిగ్గు చేటు అని అన్నారు. భారతీయులు తలదించుకునేలా వ్యవహరించారని అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమ స్పూర్తిని నింపిన గీతం వందేమాతరం అని బండి సంజయ్ తెలిపారు.
దేశభక్తిపైనా కాంగ్రెస్ సెన్సార్ విధిస్తోందా? వందేమాతరం చరిత్రను సోనియాగాంధీ తెలుసుకోవాలన్నారు. దేశం మారితే సరిపోదు.. దేశం విలువలు, సంస్క్రుతి, వేల ఏళ్ల చరిత్ర తెలిసి ఉండాలని ఫైర్ అయ్యారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదది.. ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. వందేమాతరం గీతాన్ని విని ఆనాడు బ్రిటీష్ భయపడిందని అన్నారు.
వందేమాతరం పూర్తి గీతాన్ని చూసి ఈనాడు కాంగ్రెస్ వణుకుతోంది. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలను దేశం నుండి తరిమికొట్టాలని అన్నారు. వందేమాతరాన్ని కాంగ్రెస్ అవమానించడంపై రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ నాయకత్వం క్షమాపణ చెప్పాలి. ఎంఐఎం కు దేశభక్తి లేదు. ఇండియా పై పాకిస్తాన్ గెలిస్తే కరీంనగర్లో సంబురాలు చేసుకున్న నీచ చరిత్ర ఎంఐఎం నేతలదని ఫైర్ అయ్యారు.
Also Read: 30 ఏళ్లుగా దాచుకున్న రహస్యం… పెళ్లిలో అన్నదమ్ముల అరాచకం… ఈ సైకలాజికల్ థ్రిల్లర్ చూస్తే మైండ్ బ్లాంక్