E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

వరంగల్ మేయర్ పీఠమే టార్గెట్.. 2028లో తెలంగాణపై కమలం జెండా పక్కా- బండి సంజయ్

వరంగల్ మేయర్ పీఠమే టార్గెట్.. 2028లో తెలంగాణపై కమలం జెండా పక్కా- బండి సంజయ్
Advertisement

Bandi Sanjay: హన్మకొండ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి బండి సంజయ్ రాబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వరంగల్‌లో బీజేపీ జెండా ఎగరవేయడమే తమ ప్రధాన టార్గెట్ అని స్పష్టం చేస్తూ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

వరంగల్ అభివృద్ధే లక్ష్యం

Advertisement

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వరంగల్ అభివృద్ధికి కట్టుబడి ఉందని, గ్రేటర్ పీఠం గెలిస్తే ఢిల్లీ నుండి నేరుగా వరంగల్‌కు నిధులు వస్తాయని బండి సంజయ్ హామీ ఇచ్చారు. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఇక్కడి సంపద మూటలుగా ఢిల్లీకి చేరుతుందని, ఇతర పార్టీలు గెలిస్తే నిధులు దారి మళ్లుతాయని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన స్మార్ట్ సిటీ పైసలను ఏం చేశారో గ్రేటర్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ తర్వాత కేంద్రం అత్యధిక నిధులు ఇచ్చింది వరంగల్‌కేనని ఆయన గుర్తుచేశారు.

కేంద్రం అందించిన అభివృద్ధి ఫలాలు

Advertisement

వరంగల్ ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం చేసిన మేలును ఆయన ఈ సందర్భంగా ఏకరువు పెట్టారు. కాజిపేట వ్యాగన్ తయారీ పరిశ్రమ, భద్రకాళి బండ్ సుందరీకరణ నిధులు, సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ నిర్మాణం వంటివన్నీ కేంద్ర ప్రభుత్వ చొరవతోనే సాధ్యమయ్యాయని చెప్పారు. వరంగల్‌కు ఎయిర్‌పోర్ట్ ఇచ్చిన ఘనత కూడా ముమ్మాటికీ బీజేపీదేనని బండి సంజయ్ స్పష్టం చేశారు.

విపక్షాల వైఫల్యాలు – ‘కమలం’ గెలుపు వ్యూహం

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, సీఎం రేవంత్ రెడ్డి తన యాస, భాషతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ‘రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది, కోసినా పైసలు లేవు’ అన్నది పచ్చి నిజం కాదా? అని ప్రశ్నించారు. ఇక పదేళ్లపాటు దోచుకున్న బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం అభ్యర్థులు కరువయ్యారని, ఒక సభ పెట్టాలంటే రూ. 5 కోట్లు ఖర్చు పెట్టాల్సిన దుస్థితి ఆ పార్టీకి పట్టిందని ఎద్దేవా చేశారు.

బూత్ స్థాయి కార్యకర్తల కష్టంతోనే గెలుపు సాధ్యమవుతుందని చెప్తూ, కాంగ్రెస్ వైఫల్యాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో గట్టిగా శ్రమిస్తే గ్రేటర్ వరంగల్‌పై బీజేపీ జెండా ఎగరడం ఖాయమని, అలాగే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై కమలం జెండా పక్కాగా రెపరెపలాడుతుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.

Related News

Nitin Nabin: రాహుల్ గాంధీ పార్ట్ టైమ్ పొలిటీషియన్ అంటూ.. నితిన్ నబీన్ సంచలన వ్యాఖ్యలు..!

మేడ్చల్ మెట్రోకు ఏమైంది? రేవంత్ రెడ్డిపై కేపీ వివేకానంద సంచలన వ్యాఖ్యలు!

బెంగాల్, యూపీ ఫార్ములా ఇక్కడ నడవదు.. నితిన్ నబీన్‌పై ఎంపీ చామల ఫైర్..!

వాన ఎఫెక్ట్.. సీఎం రేవంత్ ‘మధిర’ సభ రద్దు.. వేదిక ఎక్కడో తెలుసా?

‘సర్’ ప్రక్రియ వ్యవహారం.. టీఆర్ఎస్ ఛీప్ కవిత సంచలన కామెంట్స్, నా నియోజకవర్గంలో 7 వేల ఓట్లు తొలగింపు

బీహార్ మైండ్‌సెట్‌తో మాట్లాడుతున్నారు.. బీజేపీ అధ్యక్షుడిపై చామల ఫైర్

తెలంగాణలో బీజేపీకి వచ్చే ఎన్నికల్లో ఆ సీట్లు కూడా రావు.. కాంగ్రెస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

×