E-Paper
Advertisement

డీజీపీకి చేరిన ఈటల పోస్టర్ల పంచాయితీ..!

డీజీపీకి చేరిన ఈటల పోస్టర్ల పంచాయితీ..!
Advertisement

Eatala Posters: స్వేచ్చ బ్యూరో: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పై పోస్టర్లకు, గ్రూప్ తగాదాలకు సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. బీజేపీలో అంతర్గత కలహాలు పెట్టాలని ఈటల పై పోస్టర్లు పెట్టారని పేర్కొన్నారు. పోస్టర్లు పెట్టిన వారిపై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

జాతీయ నాయకత్వం ఫోకస్..

ఈ అంశంపై ఇప్పటికే డీజీపీ, కమిషనర్ కు ఫిర్యాదు చేశామన్నారు. తెలంగాణ, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే దిశగా బీజేపీ జాతీయ నాయకత్వం కార్యాచరణ రూపొందిస్తోందన్నారు. తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం ఫోకస్ చేసిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వడ్ల కొనుగోలు జరగడం లేదని, రాష్ట్రంలో ఎంత పంట పడిందనే సమాచారం కేంద్రానికి ఇవ్వలేదని తెలిపారు. రైతుల వద్ద ఉన్న పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. చివరి ధాన్యం వరకు కొనుగోలు చేస్తామని చెప్పారని, మాట ఇచ్చిన ప్రకారం కొనుగోలు చేయాలన్నారు.

Advertisement

Also Read: టాప్ 5 దుమ్మురేపే యాక్షన్ సినిమాలు… ఓటీటీ తగలడిపోవాల్సిందే భయ్యా

ఢిల్లీలో బీజేపీ ఆధ్వర్యంలో..

ప్రభుత్వం నిద్రపోతోంది కాబట్టే.. కొనుగోలు సమస్యలు వచ్చాయని ఫైరయ్యారు. ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ గ్రామాల బాట పట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం లారీలు పంపుతోందని రాంచందర్ రావు తెలిపారు. ఇదిలా ఉండగా మంగళవారం ఢిల్లీలో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ వేడుకలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సహా, బీజకేపీ జాతీయ నాయకులు పాల్గొంటారని స్పష్టంచేశారు.

Advertisement

Also Read: స్పోర్ట్స్ అంటే చెవికోసుకుంటారా ? హాట్ స్టార్ లో ఉన్న ఈ బెస్ట్ స్పోర్ట్స్ బయోపిక్ లు మీకోసమే

Related News

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

సత్తుపల్లిలో భూవివాదం కలకలం.. కోర్టు ఉత్తర్వులు ఉన్నా తహసీల్దార్ నివేదిక రైతుల ఆగ్రహం!

మెదక్ జిల్లాలో వింత ఘటన.. కుక్క పిల్లలకు పాలిస్తున్న వరాహం

పార్టీలో నుండి కవితను అందుకే తొలగించారు: ప్రశాంత్ రెడ్డి క్లారిటీ!

మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ సీన్.. లగ్జరీ కారులో వచ్చి మేకల దొంగతనం కలకలం

ఆమె మా బోధన్ కోడలు.. కవిత పై మాజీ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో ఓటర్ల వెరిఫికేషన్.. నోటీసులిచ్చినా దక్కని స్పందన!

Big Stories

Advertisement
×