E-Paper
Advertisement

BRS MLAs: కాళేశ్వరం రిపోర్టుపై చర్చ.. వాకౌట్ చేసిన బీఆర్ఎస్, చెత్తబుట్టలో కమిషన్ కాపీలు

BRS MLAs: కాళేశ్వరం రిపోర్టుపై చర్చ.. వాకౌట్ చేసిన బీఆర్ఎస్, చెత్తబుట్టలో కమిషన్ కాపీలు
Advertisement

BRS MLAs:  తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాళేశ్వరం నివేదికపై తెలంగాణ అసెంబ్లీలో దాదాపు 9 గంటలపాటు చర్చ జరిగింది. తొలుత అధికార పార్టీ దీనిపై చర్చ మొదలుపెట్టింది. ఆ తర్వాత విపక్ష బీఆర్ఎస్ సభ్యులు తమ వెర్షన్ చెప్పారు. చివరకు మాజీ మంత్రి హరీష్ రావు సభలో మాట్లాడారు.

పొలిటికల్ వెర్షన్‌లో చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పారు. 650 పేజీల నివేదికపై అరగంటలో మాట్లాడుతారా? అంటూ ప్రశ్నించారు. కమిషన్ రిపోర్టుపై న్యాయస్థానంలో స్టే వస్తుందని భావించి అత్యవసరంగా అసెంబ్లీలో పెట్టారని సభలో వాదించే ప్రయత్నం చేశారు సదరు ఎమ్మెల్యే. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సరిగా విచారణ జరపలేదన్నారు.

Advertisement

ఈ క్రమంలో అధికార పక్షం జోక్యం చేసుకుంది. తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. అధికార పార్టీ మాట్లాడే సమయానికి సభ నుంచి వాకౌట్ చేసింది బీఆర్ఎస్. ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, నేతలు గన్‌పార్క్‌ వద్ద నిరసన తెలిపారు. అమరవీరుల స్థూపం వద్ద పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును చించి చెత్త బుట్టలో పారేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.

ఈ క్రమంలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కమిషన్‌ రిపోర్టుని ట్రాష్‌ రిపోర్టుగా వర్ణించారు. అందుకే చెత్తబుట్టలో వేసినట్టు తెలిపారు. కమిషన్‌ ఏకపక్షంగా నివేదికను ఇచ్చిందని చెబుతూనే.. ఎన్డీఎస్‌ఏ, ఎన్డీఏ, పీసీ ఘోష్‌ నివేదికలను పీసీసీ రిపోర్టులని మండిపడింది.

Advertisement

ALSO READ: కాళేశ్వరం రిపోర్టు.. అర్థరాత్రి వరకు సభలో చర్చ.. సీబీఐకి అప్పగిస్తూ ప్రభుత్వం ప్రకటన

కాళేశ్వరం నివేదికను బద్నాం చేస్తే.. కేసీఆర్‌ను బద్నాం చేయాలనే ఆలోచన తప్ప రిపోర్ట్‌లో ఏమీ లేదన్నారు. వాస్తవానికి ప్రజల ముందు అన్నీ ఉన్నాయన్నారు. మా వాదన వినకుండా, క్రాస్ ఎగ్జామ్ చేయకుండా చట్టానికి ఉల్లంఘిస్తూ నివేదిక ఇచ్చిందన్నారు. కమిషన్ నివేదికపై న్యాయ పోరాటం చేస్తున్నామని, అది కంటిన్యూ అవుతుందన్నారు. రాజకీయంగా ఏం చేయాలనేది పార్టీ పరంగా కూర్చొని చర్చిస్తామన్నారు.

అంతకుముందు బీజేపీ వాకౌట్ చేసినా సభలో ఉండి ప్రసంగించారు ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదన్నది అవాస్తవమన్నారు. తుమ్మడిహట్టి నుంచి మేడిగడ్డకి ప్రాజెక్టు తరలించడంతో ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు ఒక్క చుక్క నీరు వచ్చే పరిస్థితి లేదన్నారు.

చిన్న చిన్న నదులు కలిసి ప్రాణహితగా మారుతుందన్నారు. మేడిగడ్డ వద్ద నీళ్లు ఉన్నాయని చెప్పడం శుద్ధ అబద్ధమన్నారు. అక్కడ క్యాచ్‌మెంట్ ఏరియా లేదన్నారు. కమిషన్లు రావనే ఆలోచనతో మేడిగడ్డకు తరలించారని చెప్పుకొచ్చారు.

 

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×