E-Paper
Advertisement

Telangana politics: జూబ్లీహిల్స్ బైపోల్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం, ఈసారికి అలా ముందుకు

Telangana politics: జూబ్లీహిల్స్ బైపోల్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం, ఈసారికి అలా ముందుకు

Telangana politics: తెలంగాణలో మళ్లీ టీడీపీ యాక్టివ్ అవుతుందా? స్థానిక సంస్థలకు నేతలను సిద్ధం చేస్తున్నారా? జూబ్లీహిల్స్ బైపోల్‌లో టీడీపీ మద్దతు ఎవరి వైపు? మంగళవారం రాత్రి వరకు జరిగిన తెలంగాణ టీడీపీ నేతల సమావేశంలో సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించారా? లేకుంటే బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని అన్నారా? ఇంకా లోతుల్లోకి వెళ్తే..

తెలంగాణలో టీడీపీ ప్లాన్

చాలా కాలం తర్వాత అమరావతిలో తెలంగాణ టీడీపీ నేతలతో సుధీర్ఘంగా సమావేశమయ్యారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు. మంగళవారం ఉండవల్లిలో జరిగిన సమావేశానికి తెలంగాణలో పలు జిల్లాల నేతలు హాజరయ్యారు. ఈ భేటీలో టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు, పార్టీ సంస్థాగత నిర్మాణం వంటి అంశాలపై విస్తృత చర్చ జరిగింది. అదే సందర్భంలో జూబ్లీహిల్స్ బైపోల్‌ అంశం చర్చకు వచ్చింది.

ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఉందన్నారు. తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లలేమని నేతలకు అధినేత చెప్పారట. ఒకవేళ బీజేపీ మద్దతు కోరితే కలిసి పని చేయాలని అన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లేకుంటే తటస్థంగా ఉండాలని నిర్ణయించారు. అదే సమయంలో బీఆర్ఎస్- కాంగ్రెస్‌లకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు.

స్థానిక సంస్థలపైనే టీడీపీ ఫోకస్

తెలంగాణ ప్రజల్లో టీడీపీ పట్ల ఆదరణ ఉందని, పార్టీని బలోపేతం చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో ఇప్పటికే లక్షన్నరకు మంది కార్యకర్తలు పార్టీ సభ్యత్వం పొందారని అధినేతకు వివరించారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో కమిటీల నియామకాలు పూర్తి చేయాలని రెండు లేదా మూడు రోజుల్లో పూర్తి చేయాలని సూచించారట అధినేత.

రాష్ట్రంలో టీడీపీని అట్టడుగు స్థాయి నుండి బలోపేతం చేయడానికి తాము రెడీగా ఉన్నామని నాయకులు తెలిపారు. తెలంగాణ అధ్యక్షుడి నియామకం డిలే కావడంతో తాత్కాలికంగా రాష్ట్ర స్థాయిలో కో-ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని నేతలు కోరినట్టు తెలుస్తోంది. నాయకుల నుంచి అభిప్రాయాలను సేకరించిన తర్వాత తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవిని సమర్థవంతమైన నాయకుడికి ఇస్తామని తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది.

ALSO READ: కాంగ్రెస్‌లో దుమారం రేపిన మంత్రి పొన్నం వ్యవహారం

తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి రేసులో అరవింద్ కుమార్ పేరు ఉన్నట్లు పార్టీ వర్గాల మాట. త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికల్లో టీడీపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో పోటీ చేయాలని సూచన చేశారట అధినేత చంద్రబాబు. తెలంగాణ టీడీపీ నేతలు బక్కని నరసింహులు, అరవింద్ కుమార్ గౌడ్, కంభంపాటి రామ్మోహన్, నర్సిరెడ్డి, నందమూరి సుహాసిని తదితరులు పాల్గొన్నారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 2009లో అక్కడి నుంచి కాంగ్రెస్ నుంచి విష్ణువర్థన్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో టీడీపీ జెండా రెపరెపలాడింది. అక్కడి నుంచి మాగంటి గోపీనాథ్ గెలుపొందారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ వైపు వెళ్లారు. 2018, 2023 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి గెలుపొందారు. ఒకప్పుడు బలంగా ఉండే టీడీపీ, పొత్తుల నేపథ్యంలో దూరమైన విషయం తెల్సిందే.

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×