E-Paper
Advertisement

CM Revanth Govt: సీఎం టూర్ సక్సెస్.. కీలక సంస్థలతో రేవంత్ సర్కార్ ఒప్పందం.. వేలల్లో ఉద్యోగాలు..

CM Revanth Govt: సీఎం టూర్ సక్సెస్.. కీలక సంస్థలతో రేవంత్ సర్కార్ ఒప్పందం.. వేలల్లో ఉద్యోగాలు..
Advertisement

CM Revanth Govt: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా పలు దేశాలు, సదస్సులో పర్యటిస్తున్నారు. 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులకే సీఎం రేవంత్ రెడ్డి దావోస్, లండన్, దుబాయ్‌లో పర్యటించారు. అయితే గతేడాది కంటే ఈసారి ఎక్కువ పెట్టుబడులు తేవాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ప్రముఖ సంస్థల సీఈవోలతో భేటీ అవుతున్నారు. ఓసారి ప్రభుత్తం ఏర్పడిన మొదటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం కుదుర్చుకున్న ముఖ్య ఒప్పందాలను చూద్దాం.

ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి యువత భవిష్యత్తే లక్ష్యంగా విదేశీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. 2024 జనవరిలో దావోస్ పర్యటనలో రూ.12,400 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అదానీ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకున్నారు. రాబోయే ఐదు సంవత్సరాలలో రూ.8వేల కోట్ల బ్యాటరీ ఉత్పత్తి సంస్థ స్థాపించి 6వేల మంది యువతకు ఉద్యోగం కల్పిస్తామని గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేర్కొంది. ఫార్మా కంపెనీ అయిన ఆరాజెన్ రూ.2,000 కోట్లతో మల్లాపూర్‌లో పరిశ్రమను విస్తరింప జేయాలని ఎంవోయూ కుదర్చుకున్నారు.

Advertisement

స్కైరూట్ ఏరోస్పేస్‌తో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌లో రూ.500 కోట్లతో రాకెట్ తయారీ, పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసేందుకు స్కైరూట్ ఏరోస్పేస్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో సెమీ కండక్టర్ల పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. ముఖ్యంగా రేవంత్ సర్కార్ హైదరాబాద్‌లో ఫోర్త సిటీ, ఏఐ సిటీ, డేటా సెంటర్లపై దృష్టి పెట్టింది.

తాజాగా.. మూడు రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్‌లో కూడా పర్యటించారు. సీఎం వివిద సంస్థల సీఈవోలతో సమావేశమయ్యారు. రాష్రంలో ఒక్క హైదరాబాద్ మహా నగరమే కాకుండా.. ఇతర జిల్లాల్లో కూడా పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారు. సింగపూర్‌లో మూడు రోజులు పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి మూడు కీలక ఒప్పందాలు కుదర్చుకున్నారు. రాష్ట్రంలో యువత భవిష్యత్తు కోసం ప్రారంభించిన స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీలో గుడ్ స్కిల్ ట్రైనింగ్, స్కిల్ డెవలప్‌మెంట్‌పై సింగపూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఐటీఈతో ఒప్పందం కుదుర్చుకున్నారు. సింగపూర్‌లోని ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్‌తో ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ముచ్చర్ల సమీపంలోని మీర్ఖాన్ పేటలో రూ.3500 కోట్లతో ఏఐ సెంటర్‌ను నెలకొల్పేలా చర్చలు జరిపింది. అలాగే హైదరాబాద్‌లో కొత్త ఐటీ పార్క్ ఏర్పాటు చేసేందుకు క్యాపిటల్యాండ్ సంస్థతో రూ.450 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది.

Advertisement

Also Read: Jobs in NTPC: బీటెక్ అర్హతతో ఎన్టీపీసీలో ఉద్యోగాలు.. ఈ ఉద్యోగం వస్తే నెలకు రూ.1,00,000

ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దావోస్‌లో పర్యటిస్తున్నారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు హెసీఎల్ టెక్ గ్లోబల్ సీఈవో విజయ్ కుమార్‌తో సమావేశమయ్యారు. ఆయనతో కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. హైదరాబాద్‌లో దాదాపు 3.20 లక్షల చదరపు అడుగల విస్తీర్ణంలో హెచ్‌సీఎల్ కొత్త క్యాంపస్ ఏర్పాటుకు చర్చలు జరిపారు. దీని ద్వారా 5వేల మంది ఐటీ నిపుణులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఈ క్యాంపస్‌లో లైఫ్ సైన్సెస్, ఫైనాన్షియ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆధునిక క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్‌కు సంబంధించిన విషయాలను వివరిస్తుంది. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలతో పాటు హైదరాబాద్‌లోని టెక్నాలజీ, ఇన్నోవేషన్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 2007 నుంచే హెచ్ సీఎల్ హైదరాబాద్ నుంచి ప్రపంచ వ్యాప్తంగా తమ క్లయింట్లకు సేవలను అందిస్తోంది.

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×