CM Revanth Rally: జూబ్లీహిల్స్ నివాసం నుంచి నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొవ్వుత్తుల ర్యాలీ నిర్వహించారు. నీట్ విద్యార్ధులకు సంఘీభావం కోసం కొవ్వోత్తుల ర్యాలీలో పాల్గోన్నారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీలో జరిగిన విద్యార్థులపై దాడిని నిరసిస్తు సంఘీభావ ర్యాలీ నిర్వహిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మల్యేలే, ఎంపీలు మరియు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్, వివిధ నాయుకులు పాల్గోన్నారు.
కేంద్ర ప్రభుత్వం విద్యార్థులపై కేసులు ఉపసంహరించుకోవాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. నీట్ ఉద్యమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారని అన్నారు. సోమవారంలోగా కేసులన్నీ ఉపసంహరించుకోవాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని, జెన్జీలో విజయదరహాసం కనిపిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.
Also read: Keesara Crime: ఆరో తరగతి బాలికపై.. ఇద్దరు అన్నలు, మేనమామ అఘాయిత్యం!
యువత విజయాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేసుకోబోమని స్పష్టం చేశారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామాకు యువత ఉద్యమమే కారణం అని రేవంత్ అన్నారు. విద్యార్థుల పోరాటానికి పార్టీలకతీతంగా మద్దతిచ్చారు. 18 ఏళ్లు నిండినవారికి రాజీవ్ ఓటు హక్కు కల్పించారని గుర్తు చేశారు. జెన్జీలు చట్టసభల్లోనూ గళం వినిపించాలని, 21 ఏళ్లకే MLA, MPలుగా పోటీ చేసే అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ అన్నారు. దీనిపై త్వరలె అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేస్తాం అని సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యవకులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు.
Also Read: ఢిల్లీ కేంద్రంగా బిగ్ బ్రేకింగ్ న్యూస్.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రేసులో కీలక నేత!