E-Paper
Advertisement

CM Revanth Reddy: మరోసారి ఢిల్లీకి పయనం కానున్న సీఎం రేవంత్ రెడ్డి.. అందుకోసమేనా.?

CM Revanth Reddy: మరోసారి ఢిల్లీకి పయనం కానున్న సీఎం రేవంత్ రెడ్డి.. అందుకోసమేనా.?
Advertisement

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ రోజు రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఆయన ఢిల్లీకి బయల్దేరనున్నారు. ఎల్లుండి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ మొదలుకానున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి హస్తినకు వెళ్లనున్నారు.

ALSO READ: CM Revanth Reddy: మహిళా సంఘాలకు సీఎం రేవంత్ రెడ్డి భారీ గుడ్ న్యూస్..

Advertisement

హస్తం పార్టీలో ఇప్పటికే పలువరు కీలక నేతలతో ఏఐసీసీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చర్చించారు. ఎవరికి ఏ పదవులు కావాలో వారినే అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవులకు కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది పదవుల కోసం హస్తినకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం.

ALSO READ: BOI Recruitment: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే జీతం రూ.1,20,000.. ఎలా సెలెక్ట్ చేస్తారంటే..?

Advertisement

రేపు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలను సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, తుది జాబితాపై కసరత్తు చేయనున్నట్లు తెలుస్తోంది. రేపు ఏఐసీసీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించాక ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలపై తుది ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Related News

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Big Stories

Advertisement
×