E-Paper
Advertisement

Hyderabad: బెదిరించే ప్రభుత్వం కాదు.. ప్రజా ప్రభుత్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..

Hyderabad: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ప్రజాపాలన కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు.ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటర్‌ పెట్టి ‘ప్రజాపాలన దరఖాస్తు’లను స్వీకరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని ప్రకటించారు. ప్రజలు ఎవరు ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు అందుతాయని పేర్కొన్నారు.

Hyderabad:  బెదిరించే ప్రభుత్వం కాదు.. ప్రజా ప్రభుత్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..

Hyderabad: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ప్రజాపాలన కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ గౌతమ్‌ పాల్గొన్నారు. ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటర్‌ పెట్టి ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని ప్రకటించారు. ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు అందుతాయని భరోసా ఇచ్చారు.

తమ ప్రభుత్వం వ్యక్తికో, ఒక వర్గానికో చెందింది కాదని స్పష్టంచేశారు. తమ పార్టీ‌కి వస్తేనే ఇల్లు మంజూరు చేస్తామని బెదిరించే ప్రభుత్వం కాదని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. ప్రజా పాలన అందించాలని దృఢ సంకల్పంతో ఉన్నామని తెలిపారు.

రాష్ట్రంలో గత పదేళ్లలో ప్రజలు నిధులు , నీళ్లు, నియామకాలు పొందలేదన్నారు. గత ప్రభుత్వ పాలనలో రేషన్ కార్డులు సరిగా మంజూరు చెయ్యలేదని విమర్శించారు. తమది దొరల ప్రభుత్వం కాదని ప్రజల ప్రభుత్వం అని పేర్కొన్నారు. ఈ రాష్ట్ర సంపదను ప్రజలకు అంకితం చేస్తామని భట్టి ప్రకటించారు .

‘అభయహస్తం’లో మోసాలకు అవకాశం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. నేటి నుంచి జనవరి 6 వరకు ‘అభయహస్తం’ గ్యారంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తారని మంత్రి ప్రకటించారు. బంజారాహిల్స్‌ లో నిర్వహించిన ప్రజా పాలన‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలకు సందేహాలు ఉంటే అధికారులను అడిగి పరిష్కరించుకోవాలని సూచించారు.

హైదరాబాద్‌లో 600 కేంద్రాల్లో ప్రజల వద్దకే పాలన పేరుతో కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. అర్హతను బట్టి లబ్ధిదారుల ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. పథకాలు అమలులో ఎలాంటి పైరవీలకు అవకాశం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ సృష్టం చేశారు.

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×