E-Paper
Advertisement

Fertility Centre Scam: సృష్టి ఫెర్టిలిటీ కేసులో బిగ్ ట్విస్ట్.. 50కోట్ల విలువైన ఆస్తులు ఎటాచ్..!

Fertility Centre Scam: సృష్టి ఫెర్టిలిటీ కేసులో బిగ్ ట్విస్ట్.. 50కోట్ల విలువైన ఆస్తులు ఎటాచ్..!
Advertisement

Fertility Centre Scam: స్వేచ్ఛ బ్యూరో: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో ఈడీ అధికారులు కొరడా ఝళిపించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న డాక్టర్​ నమ్రతకు చెందిన 29.76కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను అటాచ్​ చేశారు. బహిరంగ మార్కెట్​ లో వీటి విలువ 50కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. డాక్టర్ నమ్రత గోపాలపురం పోలీస్​ స్టేషన్​ పరిధిలో యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్​ ను నడిపించిన విషయం తెలిసిందే.

మీ కల నెరవేరుస్తానని..

సంతానం లేని భార్యాభర్తలకు సంతాన భాగ్యం కల్పిస్తానని విస్తృతస్థాయిలో ఆమె ప్రచారం చేయటంతో పదుల సంఖ్యలో జనం ఆమె వద్దకు వచ్చారు. ఇలా వచ్చిన వారిని విశాఖపట్టణంలోని మరో బ్రాంచ్​ కు పంపించి అక్కడ వైద్య పరీక్షలు జరిపిస్తూ వచ్చిన డాక్టర్​ నమ్రత సరోగసి ద్వారా మీ కల నెరవేరుస్తానని నమ్మించింది. ఈ క్రమంలో లక్షల రూపాయలు వసూలు చేసింది. అయితే, సరోగసి ద్వారా కాకుండా ఇతరులకు పుట్టిన శిశువులను డబ్బు ఇచ్చి కొని సంతానం కోసం తన వద్దకు వస్తున్న వారికి మీకే పుట్టారని చెప్పి అప్పగించింది. అయితే, ఢిల్లీకి చెందిన ఓ దంపతులు అనుమానంతో తమకు ఇచ్చిన బిడ్డకు డీఎన్​ఏ పరీక్షలు జరిపించగా డాక్టర్​ నమ్రత సాగిస్తున్న అక్రమాలు బయట పడ్డాయి. భార్యాభర్తలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన గోపాలపురం పోలీసులు విచారణ జరిపారు. దీంట్లో తన అక్రమాలను కొనసాగించటానికి డాక్టర్ నమ్రత ఏజెంట్లు, సబ్ ఏజెంట్లతో ఓ పెద్ద నెట్ వర్క్ నడిపినట్టుగా వెల్లడైంది.

Advertisement

Also Read: Hyderabad Murder: వెయ్యి రూపాయల కోసం ఓ వ్యక్తి దారుణ హత్య..!

29.76 కోట్ల రూపాయల..

డాక్టర్​ లైసెన్స్ సస్పెండ్​ అయినా ఆ విషయాన్ని దాచి పెట్టి 2014 నుంచి డాక్టర్ నమ్రత సరోగసి పేర చైల్డ్​ ట్రాఫికింగ్ కు పాల్పడుతూ వచ్చినట్టుగా నిర్దారణ అయ్యింది. ఈ క్రమంలో గోపాలపురం పోలీసులు డాక్టర్​ నమ్రతతోపాటు అడ్వకేట్​ గా పని చేస్తున్న ఆమె కుమారుడు, మరికొందరు నిందితులను అరెస్ట్ చేశారు. కాగా, ఈ వ్యవహారంలో మనీలాండరింగ్​ జరిగినట్టుగా తెలియటంతో ఈడీ అధికారులు కూడా కేసులు నమోదు చేశారు. ఇటీవల కోర్టు అనుమతితో డాక్టర్ నమ్రతను మూడు రోజులపాటు కస్టడీకి తీసుకుని విచారణ జరిపారు. ఈ క్రమంలో డాక్టర్​ నమ్రత, ఆమె కుమారుల పేరన యాభైకి పైగా ఆస్తులను అధికారులు గుర్తించారు. వీటిలో 29.76 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను మంగళవారం అటాచ్​ చేశారు. నిజానికి ప్రైవేట్ మార్కెట్ లో వీటి విలువ 5‌‌0 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు తెలిపారు.

Advertisement

Also Read: Jupally Krishna Rao: ఆదాయ మార్గాల కోసం ప్రణాళికలు రూపొందించండి: మంత్రి జూపల్లి..!

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×