E-Paper
Advertisement

Hyderabad News: హైదరాబాద్ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో విషాదం.. ఐదుగురు మృతి

Hyderabad News: హైదరాబాద్ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో విషాదం.. ఐదుగురు మృతి
Advertisement

Hyderabad News: హైద‌రాబాద్‌ సిటీలో ఆదివారం రాత్రి జరిగిన శ్రీకృష్ణాష్ట‌మి వేడుక‌ల్లో విషాదం చోటు చేసుకుంది. రథాన్ని లాక్కుంటూ వెళ్తున్న సమయంలో భక్తులకు విద్యుత్‌ తీగ తగలింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలో ఆసుపత్రికి తరలించారు.

Advertisement

హైదరాబాద్ సిటీలో రామంత్‌పూర్ ప్రాంతంలో శ్రీకృష్ణాష్ట‌మి వేడుక విషాదంగా మారింది. శనివారం శ్రీకృష్ణాష్ట‌మి కావడంతో ఆదివారం ఊరేగింపు ప్లాన్ చేశారు నిర్వాహకులు. గోఖలే నగర్‌ ప్రాంతంలో శ్రీ కృష్ణుడి ఊరేగింపు వేడుకలో అపశ్రుతి చోటు చేసుకుంది. రాత్రి 12 గంటల సమయంలో రథాన్ని లాక్కుంటూ భక్తులు భారీ ఎత్తున వెళ్తున్నారు.

రథం ఎత్తు ఎక్కువగా ఉండడం, మరోవైపు వర్షానికి విద్యుత్ తీగలు తడిచి ఉన్నాయి. ఈ నేపథ్యంలో రథాన్ని లాక్కుంటూ వెళ్తున్న భక్తులకు ఒక్కసారిగా విద్యుత్ షాక్ కొట్టింది. మొత్తం 9 మంది భక్తులకు విద్యుత్‌ షాక్‌ కొట్టింది. స్పాట్‌లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. యాదవ్‌ సంగం ఫంక్షన్‌ హాల్‌ వద్ద ఈ దుర్ఘటన జరిగింది.

Advertisement

మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే స్థానిక పోలీసులు అంబులెన్స్ సమాచారం ఇవ్వడంతో క్షణాల వ్యవధిలో అక్కడికి చేరుకుంది. షాక్‌ కొట్టి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారిని ట్రీట్ మెంట్ నిమిత్తం రామాంతపూర్‌లో ఆసుపత్రికి తరలించారు. మరో ముగ్గురి పరిస్థతి విషమంగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.

ALSO READ: వాయగుండంగా అల్పపీడనం.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్  

మృతుల వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణ యాదవ్- 24, శ్రీకాంత్ రెడ్డి-35, సురేష్ యాదవ్-34, రుద్ర వికాస్ -39, రాజేంద్ర‌రెడ్డి-39 ఉన్నారు. మరణించినవారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.  ఘటన వెనుక అసలు కారణం వెలుగులోకి వచ్చింది.

ర‌థాన్ని లాగుతున్న వాహ‌నం చెడిపోయింది. ఆ వాహనాన్ని ప‌క్క‌కు నిలిపి వేశారు. చేసేదేమీ లేక ర‌థాన్ని చేతుల‌తో లాగుతూ ముందుకు భక్తులు ముందుకు కదిలారు. ఈ క్ర‌మంలో ర‌థానికి విద్యుత్ తీగ‌లు త‌గిలాయని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.

రాత్రి 12 గంటలకు కరెంటు వైర్ కిందికి వేలాడడంతో ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. హై టెన్షన్ వైర్ల నుంచి ఓ వైర్ వేలాడుతుండడంతో రథానికి తాకి నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. రథాన్ని పట్టుకున్న వాళ్లంతా ఒక్కసారిగా దూరంగా పడిపోయారు.  రథంపై ఉన్న పూజారికి మరికొందరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని చెబుతున్నారు.

కేవలం రథాన్ని పట్టుకొని లాక్కెళ్తున్న వారికి కరెంట్ షాక్ తగిలింది. ఘటన తర్వాత వారంతా కిందిపడిపోయారు. వెంటనే వారిని సిపిఆర్ చేసి బతికించే ప్రయత్నం చేశారు. హాస్పిటల్ వెళ్లేలోపే ఐదుగురు చనిపోయారు. గాయ‌ప‌డిన వారిలో కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి గ‌న్‌మెన్ శ్రీనివాస్ ఉన్న‌ట్లు స‌మాచారం.  గతంలో ఈ తరహా ఘటనలు జరగలేదని, ఇదే తొలిసారని అంటున్నారు.  

 

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×