E-Paper
Advertisement

HCU Dispute: హెచ్‌సీయూ ల్యాండ్ వివాదం.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

HCU Dispute: హెచ్‌సీయూ ల్యాండ్ వివాదం.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

HCU Dispute: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో రేవంత్ సర్కార్ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కంచె గచ్చిబౌలి భూములపై చర్యలు నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కంచ గచ్చిబౌలి భూముల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ మధ్యంతర నివేదికను పంపారు. హైకోర్టు నివేదికను జస్టిస్‌ గవాయ్‌ ధర్మాసనం క్షుణ్ణంగా పరిశీలించింది. చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది చాలా కీలకం అయిన అంశమని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి అంశాలను అమికస్‌ క్యూరీ.. జస్టిస్‌ గవాయ్‌ ధర్మాసనం ముందు ఉంచింది.

ALSO READ: Jobs: రూ.లక్ష జీతంతో ఎగ్జిమ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. ఏదైనా డిగ్రీ పాసైతే చాలు భయ్యా..

సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం..

ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)ని సర్వోన్నత న్యాయస్థానం ప్రతివాదిగా చేర్చగా.. అత్యవసరంగా కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరం ఏంటిని ప్రశ్నల వర్షం కురిపించింది. ఒకవేళ ఇది అటవీ ప్రాంతం కాకపోయినా,  జేసీబీలతో చెట్లను తొలగించే ముందు అయినా సీఈసీ అనుమతి తీసుకున్నారా..? అని నిలదీసింది. రాష్ట్రంలో ఏదైనా ఉల్లంఘన జరిగితే సీఎస్‌దే బాధ్యతని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టు ఆగ్రహం

ఒక్కే రోజులో వంద ఎకరాల్లో చెట్లు కొట్టేయడం మామూలు విషయం కాదని సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. తమ ప్రశ్నల అన్నింటికి సీఎస్‌ సమాధానం చెప్పాలని సుప్రీం ఆదేశించింది. అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీం కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోలేరని.. తెలంగాణ సీఎస్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెట్ల నరికివేతగా సుమోటోగా విచారణ చేపట్టామని.. హైకోర్టు రిజిస్ట్రార్ ను ప్రత్యక్ష పరిశీలనకు పంపించి నివేదిక తెప్పించుకున్నామని పేర్కొంది.. ఆ రిపోర్టును పరిగణనలోకి తీసుకున్నామని జస్టిస్ గవాయ్ ప్రకటించారు.

 అన్నీ నిలుపుదల చేయండి..

ఇదే అంశంపై ఈ రోజు పొద్దున సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మధ్యాహ్నం 3.30 గంటల్లోగా నివేదిక అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 30 ఏళ్లుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈ భూమి వివాదంలో ఉందని ప్రభుత్వ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అసలు ఎక్కడా.. అటవీ భూమి అని ఆధారాలు లేవని ప్రభుత్వ తరుఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. తాజాగా మరోసారి ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ చర్యలు అన్నీ నిలుపుదల చేయాలని ఆదేశించింది.

ALSO READ: Praveen pagadala cc tv footage: ఈ ప్రశ్నలకు బదులేది? సీసీటీవీ ఫుటేజీలు నిజం కాదా? హర్షకుమార్, పాల్ సందేహాలు

ALSO READ: Tenth Class Results: మే ఫస్ట్ వీక్‌లో టెన్త్ ఫలితాలు.. జస్ట్ వారం రోజుల్లోనే ముల్యాంకనం ముగిసేలా..?

 

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×