E-Paper
Advertisement

ఓల్డ్ సిటీ మెట్రోకు గ్రీన్ సిగ్నల్.. 84 భారీ వృక్షాలను రూ.15.64 లక్షలతో ట్రాన్స్‌లొకేషన్

ఓల్డ్ సిటీ మెట్రోకు గ్రీన్ సిగ్నల్.. 84 భారీ వృక్షాలను రూ.15.64 లక్షలతో ట్రాన్స్‌లొకేషన్
Advertisement

పాతబస్తీ మెట్రో ప్రాజెక్టులో కీలకమైన ముందడుగు పడింది. ఎంజీబీఎస్-దారుల్షిఫా నుంచి ఫలక్‌నుమా వరకు సాగే మెట్రో అలైన్‌మెంట్‌లో ఉన్న ప్రధాన ఆటంకాలను తొలగించేందుకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (HAML) చర్యలు చేపట్టింది. ఈ మార్గంలో అడ్డుగా ఉన్న 84 భారీ చెట్లను నరికివేయకుండా మరో చోటికి తరలించాలని (ట్రాన్స్‌లొకేషన్) అధికారులు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి తాజాగా టెండర్లను ఆహ్వానించారు.

ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 15.64 లక్షలుగా నిర్ణయించారు. పాతబస్తీ వాసుల చిరకాల స్వప్నమైన మెట్రో పనులను పర్యావరణ హితంగా పూర్తి చేయడమే లక్ష్యంగా హామల్ అడుగులు వేస్తోంది. టెండర్లు దక్కించుకున్న సంస్థ ఈ పనులను మూడు నెలల గడువులోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చెట్లను వేళ్లతో సహా పెకిలించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు.

Advertisement

మెట్రో రెండో దశ విస్తరణలో భాగంగా పాతబస్తీ లైన్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దారుల్షిఫ, పురానీ హవేలీ, ఈతేబార్ చౌక్, ఆలిజా కోట్లా, లాల్ బజార్, మీర్ ఆలం మండి వంటి రద్దీ ప్రాంతాల గుండా ఈ రైలు ప్రయాణించనుంది. ఇరుకైన రహదారులు.. చారిత్రక కట్టడాల మధ్య మెట్రో పిల్లర్ల నిర్మాణం సవాలుగా మారింది. ప్రస్తుతం చెట్ల మార్పిడి ప్రక్రియ పూర్తికావడంతో సివిల్ పనులకు మార్గం సుగమం కానుంది.

ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో ఎదురైన న్యాయపరమైన.. సాంకేతికపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోవడంతో పనులు వేగవంతం అయ్యాయి. చెట్ల తరలింపు ప్రక్రియలో పర్యావరణ నిపుణుల పర్యవేక్షణ ఉంటుంది. ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయితే పాతబస్తీ నుంచి నగరంలోని ఇతర ప్రాంతాలకు రవాణా వ్యవస్థ మెరుగుపడుతుంది. ట్రాఫిక్ కష్టాల నుంచి స్థానికులకు విముక్తి లభిస్తుంది.

Advertisement

వచ్చే మూడు నెలల్లోగా చెట్ల తరలింపు ప్రక్రియను ముగించి పిల్లర్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని హామల్ భావిస్తోంది. పర్యావరణాన్ని కాపాడుతూనే అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ: పంచాయతీరాజ్ శాఖలో భారీగా ఖాళీలు.. ఇదిగో లెక్కలు..!

Related News

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

సత్తుపల్లిలో భూవివాదం కలకలం.. కోర్టు ఉత్తర్వులు ఉన్నా తహసీల్దార్ నివేదిక రైతుల ఆగ్రహం!

మెదక్ జిల్లాలో వింత ఘటన.. కుక్క పిల్లలకు పాలిస్తున్న వరాహం

పార్టీలో నుండి కవితను అందుకే తొలగించారు: ప్రశాంత్ రెడ్డి క్లారిటీ!

మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ సీన్.. లగ్జరీ కారులో వచ్చి మేకల దొంగతనం కలకలం

ఆమె మా బోధన్ కోడలు.. కవిత పై మాజీ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో ఓటర్ల వెరిఫికేషన్.. నోటీసులిచ్చినా దక్కని స్పందన!

Big Stories

Advertisement
×