E-Paper
Advertisement

Hyderabad News: రూల్స్ అధిగమిస్తే కష్టాలు తప్పవు.. వాళ్లపై ట్రాఫిక్ పోలీసుల గురి

Hyderabad News: రూల్స్ అధిగమిస్తే కష్టాలు తప్పవు.. వాళ్లపై ట్రాఫిక్ పోలీసుల గురి
Advertisement

Hyderabad News: ‘భరత్ అనే నేను’ సినిమా హైదరాబాద్‌ సిటీలో రిపీట్ కానుందా? అడ్డదిడ్డంగా వాహనాలు నడిపేవారికి ఇకపై భారీ జరిమానాలు తప్పవా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. సిటీలో వారం పాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు ట్రాఫిక్ పోలీసులు. నమోదైన కేసులు చూసి అధికారులు షాకయ్యారు. ఒక్కటీ రెండు కాదు.. ఏకంగా దాదాపు 19 వేల కేసులు నమోదు అయ్యాయి.

ట్రాఫిక్ విషయంలో అధికారులు ఎన్ని రూల్స్ తెచ్చినా వాహనదారులు అస్సలు పట్టించుకోలేదు. రూల్స్ అధిగమించేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇందుకు నిదర్శనం గతవారం పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్. ఎన్ని చలాన్లు వేసినా వాహనదారుల్లో మార్పు రాలేదు. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించడం కామన్‌గా మారిపోయింది.

Advertisement

ఫలితంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్య సిటీలోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు తమ చేతిలో ఉన్న కెమెరాలకు పని కల్పించారు. ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో రికార్డు స్థాయిలో నిబంధనల అతిక్రమణ కేసులు నమోదయ్యాయి.

మే 20 నుంచి మే 26 వరకు అంటే కేవలం వారం రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో 18 వేల 798 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు అయ్యాయి. దీనికి సంబంధించి డేటాను మంగళవారం విడుదల చేశారు అధికారులు. అందులో రాంగ్ రూట్‌లో వాహనాలు నడిపినవారిపై దాదాపు 14 వేల 917 కేసులు బుక్కయ్యాయి. చెప్పాలంటే ఇదొక డేంజర్ బెల్స్ అన్నమాట.

Advertisement

ALSO READ: హైదరాబాద్‌లో దంచి కొట్టిన వాన, నాలుగు రోజులు ఇలాంటి పరిస్థితే

రూల్స్ అధిగమనించిన వారిపై ట్రాఫిక్ పోలీసులు ఫొటో క్లిక్ చేస్తారు. ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి చలాన్లపై డిస్కౌంట్లు ఇస్తుంటారు. దీన్ని ఆసరాగా చేసుకుని నిబంధనలు అతిక్రమించడం వాహనాదారులకు కామన్‌గా మారిపోయింది. ఈ విషయంలో తాము మారేది లేదని వాహనదారులు చెప్పకనే చెబుతున్నారు.

నెంబర్ ప్లేట్ సరిగ్గా లేని వాహనాలపై కొరడా ఝుళిపించారు పోలీసులు. ఈ వ్యవహారంలో మొత్తం 3,881 కేసులు నమోదు అయ్యాయి. వాహనదారులు ఇలాగే కంటిన్యూ చేస్తే ప్రమాదాలు పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ ఫైన్లు వేయడం, వాటిని కట్టలేని వారు వాహనాలను సీజ్ చేయకుంటే మారే అవకాశం ఉండదని కొందరు నిపుణుల మాట.

ఇక్కడే చాలామంది ‘భరత్ అనే నేను’ సినిమాను గుర్తు చేస్తున్నారు. ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గినా ప్రమాదాలు కంటిన్యూ అవుతాయని అంటున్నారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఎక్కడ పడితే అక్కడ పోలీసులు అనౌన్స్‌మెంట్లు చేస్తున్నారు. అయినా ఏ మాత్రం మారినట్టు కనిపించడం లేదు. స్కూళ్లు, కాలేజీలు లేని సమయంలో ఈ స్థాయిలో కేసులు నమోదు అయ్యాయి.

పాఠశాలలు, కాలేజీలు ఓపెన్ తర్వాత ఇంకెన్ని కేసులు నమోదు అవుతాయోనని అంటున్నారు. కచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వడం వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు. సురక్షితమైన ప్రయాణం చేయవచ్చు, ఇంటికి చేరుకోవచ్చు. లేకుంటే జరిమానా చెల్లించుకోవాల్సివస్తుంది. రూల్స్ అధిగమించినవారు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సోషల్ సర్వీసు చేస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని అంటున్నారు అధికారులు.

Related News

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

సీఎం ఛాన్స్ వస్తే.. ఆ దేవుడు కూడా ఆపలేడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ముందు.. సీఎంపై చర్యలు తీసుకోవాలి.. కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్

సెక్రటేరియట్ భద్రత అధికారులకు మంత్రి మాస్ వార్నింగ్.. మళ్లీ రిపీట్ కావొద్దంటూ ఫైర్!

ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతులకు.. తెలంగాణ సర్కార్ షాకింగ్ న్యూస్..!

కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనపై కేటీఆర్ విసుర్లు, జెన్ జీ పేరు ప్రస్తావిస్తూ..

తెలంగాణలో 1000 రోజుల పాలన.. సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ పోస్ట్, ప్రయాణంలో తోడుగా నిలిచిన..

Big Stories

Advertisement
×