E-Paper
Advertisement

Karimnagar Indiramma houses : ఇందిరమ్మ ఇళ్లు.. లబ్ధిదారుల్లో చిగురిస్తున్న ఆశలు..

Karimnagar Indiramma houses :  ఇందిరమ్మ ఇళ్లు.. లబ్ధిదారుల్లో చిగురిస్తున్న ఆశలు..
Advertisement

Karimnagar Indiramma houses : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాష్ట్ర ఏర్పాటుకు ముందు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది .70 గజాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టారు. కానీ లబ్ధిదారులకి అందించడంలో‌ ఆలస్యమైంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014 లో బీఅర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. తొమ్మిదిన్నర ఏళ్ల బీఅర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఇందిరమ్మ ఇళ్లపై నిర్లక్ష్యం వహించారు. దీంతో ఆ ఇళ్ల నిర్మాణాలు పూర్తికాలేదు.

గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చింది. రుణాలు కూడా మంజూరు చేసింది. అయితే అప్పట్లో రెండు విడతల్లో ఈ ఇళ్లను మంజూరు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకం నీరుకారి పోయి ముందుకు సాగలేదు. ఈ ఇళ్ల లబ్ధిదారులు ఎంపికలో అక్రమాలు జరిగాయని బీఅర్ఎస్ ప్రభుత్వం విచారణ చేసింది. ఇందిరమ్మ ఇళ్ల స్థానంలో డబుల్ బెడ్ ఇళ్లు ఇస్తామని ప్రజలకు ఆశ చూపింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేదని ప్రజలు అంటున్నారు.

Advertisement

అప్పట్లో నిర్మాణం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు శిథిలావస్థలో ఉన్నాయి. లబ్ధిదారులు కనీస వసతలు లేకపోవడంతో ఈ కాలనీలో అడుగు పెట్టలేకపోయారు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఇందిరమ్మ ఇళ్లు మరింత అధ్వాన్నంగా మారిపోయాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఇళ్లకు ఒక్క పైసా కూడా మంజూరు చేయలేదు. మళ్లీ తిరిగి పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో లబ్ధిదారులు ఆశలు చిగురుస్తున్నాయి.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. అంతేకాదు కనీస సౌకర్యాలు కల్పిస్తారనే అభిప్రాయం వ్యక్తయవుతోంది. చాలా మంది లబ్ధిదారులు అప్పులు తెచ్చి ఇళ్లను నిర్మించుకున్నారు. ప్రభుత్వం నిధులు ఇస్తుందని ఆశపడుతున్నారు.

Advertisement

ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పటివరకు ఇంటి నెంబర్లు ఇవ్వడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. విద్యుత్ కనెక్షన్ లేని కారణంగా ఇందిరమ్మ కాలనీ అంధకారంలో కొట్టుమిట్టాడుతోంది. లబ్ధిదారులు కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో తమ సమస్యలు పరిష్కారమవుతాయని లబ్ధిదారులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు .

Related News

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆపై ప్రభుత్వం ప్రకటన

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

Big Stories

Advertisement
×