E-Paper
Advertisement

GHMC: జీహెచ్ఎంసీకి మూడు కార్పొరేషన్లు.. ముగ్గురు ఆఫీసర్లు..?

GHMC: జీహెచ్ఎంసీకి మూడు కార్పొరేషన్లు.. ముగ్గురు ఆఫీసర్లు..?
Advertisement

GHMC:స్వేఛ్చ బ్యూరో: జీహెచ్ఎంసీలో పాలక మండలి అధికార గడువు మంగళవారంతో ముగియటంతో స్పెషలాఫీసర్ పాలనను ప్రారంభిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం యువజన సర్వీసులు, క్రీడల శాఖలకు ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న జయేష్ రంజన్‌ను జీహెచ్ఎంసీ(GHMC)తో పాటు తాజాగా విభజించిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు కూడా స్పెషలాఫీసర్ గా వ్యవహారించనున్నట్లు సర్కారు ఆదేశాల్లో పేర్కొంది.

ఉత్తర్వులు జారీ..

ప్రభుత్వ ఆదేశాల మేరకు జయేష్ రంజన్ బుధవారం ఉదయం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. ఆయన్ను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు జయేష్ రంజన్ స్పెషలాఫీసర్ గా బాధ్యతలను కూడా స్వీకరించారు. నిన్న మొన్న వరకు విస్తరిత జీహెచ్ఎంసీకి కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న ఆర్.వి. కర్ణన్‌ను 150 వార్డులతో కొత్తగా విభజించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్ గా కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Also Read: Musi River Project: మూసీ ప్రక్షాళనకు మొట్టమొదటి భూసేకరణ ఈ జిల్లా నుంచే ప్రారంభం

కమిషనర్లుగా బాధ్యతలు..

నవంబర్ 25వ తేదీన తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ లోని 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం, ఆ తర్వాత పెరిగిన జీహెచ్ఎంసీ పరిధి పునర్విభజించిన తర్వాత ఆరు జోన్లకు అదనపు కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ ఆఫీసర్లు సృజన, వినయ్ కృష్ణారెడ్డిలు కూడా సర్కారు ఆదేశాల మేరకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ లకు కమిషనర్లుగా బాధ్యతలను స్వీకరించారు.

Advertisement

Also Read: YS jagan : ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ గోల..రూల్స్ మరిచారా?

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×