E-Paper
Advertisement

KCR BIRTHDAY: నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ పాఠశాలలో KCR బర్త్ డే వేడుకలు

KCR BIRTHDAY: నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ పాఠశాలలో KCR బర్త్ డే వేడుకలు
Advertisement

KCR BIRTHDAY: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ప్రభుత్వ పాఠశాలలో జరపడం వివాదాస్పదంగా మారింది. ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినా పురంలోని నందనవనం కాలనీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మాజీ కార్పొరేటర్ పద్మనాయక్ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు.

అయితే, ఈ స్కూల్ కు సంబంధించి ప్రిన్సిపల్ ప్రభాకర్ రావు సైతం వెల్మ కులానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. కాగా ఒక మాజీ ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు ప్రభుత్వ పాఠశాలలో జరగడం ఎంతవరకు సమంజసం అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా పండ్లు పంచితే స్వీట్లు పంచితే తప్పులేదు కానీ వేడుకలు జరపడం విద్యార్థులతో జేజేలు కొట్టించడం కరెక్ట్ కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలా కేసీఆర్ పుట్టినరోజు జరపడం పై స్కూల్ ప్రిన్సిపల్ పైన విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటారా లేదా అని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

ALSO READ: KCR BIRTHDAY: మా నాన్న తెలంగాణ హీరో.. KTR ఎమోషనల్ ట్వీట్

కాగా.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ బర్త్ డే వేడుకలు బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరిపాయి. కేసీఆర్ జన్మదిన వేడుకలు భువనగిరి పట్టణంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ సాధించడంతో పాటు రాష్ట్ర రూపురేఖలను మార్చేసిన ఘనత మాజీ సీఎం కేసిఆర్‌ కు మాత్రమే దక్కుతుందని చెప్పారు. తెలంగాణకు మార్గదర్శి, జాతిపిత కేసీఆర్‌ అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

ALSO READ: Rajasingh vs Bandi Sanjay: హైకమాండ్ సీరియస్.. కావాలనే రాజాసింగ్‌ను సైడ్ చేస్తున్నారా?

తెలంగాణ ఉన్నంతకాలం ఆయన చేపట్టిన కార్యక్రమాలు చిరస్థాయిగా నిలుస్తాయని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే లబ్ధి పొందాయన్నారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, మహేందర్ రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి,  జడ్పీ మాజీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, పార్టీ నాయకులు కొలుపుల అమరేందర్, ఏవీ కిరణ్, ఎనబోయిన ఆంజనేయులు, తదితరులు ఉన్నారు.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×