Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు మంత్రి కొండా సురేఖ దూరంగా ఉన్నారు. దీంతో ఈ వార్త సంచనలం రేపుతుంది. దేవదాయశాఖ మంత్రి కొండా సురేఖ లేకుండానే మేడారం పనుల పరిశీలన చేయడంతో అందరి చూపు అటువైపే వెల్లింది. పరకాల బహిరంగ సభలోనూ మంత్రి కొండా సురేఖ కనిపించలేదు.
కాంగ్రెస్లో వర్గవిభేదాల కారణంగానే దూరంగా ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో తీవ్రచర్చ జరుగుతుంది. పరకాల నియోజకవర్గంలోని కొండా అభిమానుల్లో గందరగోళం నెలకొంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రేవూరి ప్రకాష్ రెడ్డిని ఆశీర్వదించాలని సభలో సీఎం రేవంత్ రెడ్డి కోరడం ఇప్పుడు సంచలనంగా మారింది.
Also Read: మేడ్చల్లో బయటపడ్డ భారీ స్కామ్.. అహ్మదాబాద్ లారీలో ఊహించని దృశ్యాలు!
అయితే పరకాల నుండి ఎమ్మెల్యేగా పోటీచేస్తానని గతంలో కొండా సురేఖ కూతురు సుస్మిత పటేల్ ప్రకటించారు. దీంతో సీఎం వేరే వ్యక్తి పేరుచెప్పడం ఇప్పడు పొలిటికల్లో హట్ టాపిక్ గా మారింది. తమ కూతురు పరకాల ఎమ్మెల్యే అవుతుందని గతంలో కొండా మురళి బహిరంగంగా ప్రకటించారు. సీఎం ప్రకటనతో కొండా వారసురాలి పొలిటికల్ ఎంట్రీకి బ్రేక్ పడినట్టైంది.
Also Read: అధికారం కోసం క్షుద్ర పూజలా? తెలంగాణకి వీళ్లే శనీశ్వరులు- సీఎం రేవంత్ రెడ్డి