E-Paper
Advertisement

KTR: అంబర్‌పేటలో కేటీఆర్‌కు ఊహించని షాక్.. డిప్రేషన్‌లోకి కేసీఆర్?

KTR: అంబర్‌పేటలో కేటీఆర్‌కు ఊహించని షాక్.. డిప్రేషన్‌లోకి కేసీఆర్?
Advertisement

KTR Comments on HYDRA Demolitions: మంత్రి కొండా సురేఖ సోమవారం మీడియా సమావేశం నిర్వహించి కేటీఆర్, కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తనపై ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారంటూ ఆమె మండిపడింది. తనని దారుణంగా కించపరుస్తూ పోస్టులు పెట్టారంటూ కొండా సురేఖ కంటతడి సైతం పెట్టారు. ఈ పోస్టుల నేపథ్యంలో కేసీఆర్, కేటీఆర్ తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ సదరు మంత్రి వారిని హెచ్చరించారు.

Also Read: ట్రోలింగ్స్ బ్యాచ్ కి సినిమా చూపించనున్న రేవంత్ సర్కార్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ పట్ల గుస్సా

Advertisement

ఈ క్రమంలో కేటీఆర్ కు ఊహించిన విధంగా భారీ షాక్ తగిలింది. మంగళవారం ఆయన అంబర్ పేటలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనను కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డగించి ఏ మాత్రం ముందుకు కదలకుండా భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కేటీఆర్ కు వ్యతిరేకంగా వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వెంటనే మంత్రి కొండా సురేఖకు క్షమాపణలు చెప్పాలంటూ వారు డిమాండ్ చేశారు. కేటీఆర్ ను చుట్టుముట్టి నినాదాలు చేశారు. ఇటు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కూడా వారికి పోటీగా నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు అక్కడ టెన్షన్ సిచుయేషన్ నెలకొన్నది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టారు.

ఇదిలా ఉంటే.. అంబర్ పేట పరిధిలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి పర్యటించారు. పలువురు బాధితులతో మాట్లాడి వారి సమస్యలు ఏంటో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ రివర్ డెవెలప్ మెంట్ పేరుతో రూ. కోట్లు దోచుకోబోతున్నారని, అదేవిధంగా సుమారుగా 2 లక్షల మందిని రోడ్డున పడేసే ప్రయత్నం జరుగుతోందంటూ ఆయన ఆరోపించారు. తమ హయాంలో మూసీకి సంబంధించిన ప్రాజెక్టులను నిలివేశామన్నారు. అందుకు కారణం పేదలకు ఇబ్బందులు రాకూడదన్న ఉద్దేశం మాత్రమేనంటూ కేటీఆర్ గుర్తు చేశారు.

Advertisement

Also Read: మూసీ ప్రక్షాళన అడ్డుకోవడం వెనుక.. చేతులు మారిన వందల కోట్లు

గత అసెంబ్లీ ఎన్నికల్లో నగర ప్రజలు బీఆర్ఎస్ కు పట్టంకట్టారన్నారు. దీంతో వారిపై సీఎం రేవంత్ రెడ్డి పగబట్టి లక్షలాది మందికి నిద్ర లేకుండా చేస్తున్నారంటూ కేటీఆర్ విమర్శించారు. నగరంలో చాలామంది తమ ఇళ్లు ఎప్పుడు కూల్చుతారోనని దిగులుగా ఉన్నారంటూ ఆయన అన్నారు. ఇక నుంచి నగర ప్రజలు తమ ఇళ్ల వద్దకు బుల్డోజర్లు వస్తే వాటిని అడ్డుకునేందుకు కంచెలను ఏర్పాటు చేయాలన్నారు. అంబర్ పేటలో పేద ప్రజల ఇళ్లు కూల్చుతుంటే స్థానిక ఎంపీ ఎక్కడికి వెళ్లారంటూ కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి… వీళ్లిద్దరూ ఒక్కటేనంటూ పరోక్షంగా ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ పేద ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుందంటూ ఆయన భరోసా ఇచ్చారు.

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×