Swetcha Effect: ఎల్లంపేట మున్సిపల్ 16వ వార్డు కౌన్సిలర్ సురేష్ రెడ్డి వాహనంపై కొనసాగుతున్న ‘పీఏసీఎస్ చైర్మన్’ బోర్డు వివాదానికి చివరకు చెక్ పడింది. “స్వేచ్ఛ” పత్రికలో శుక్రవారం ప్రచురితమైన “రూల్స్ బ్రేక్” కథనానికి స్పందించిన మేడ్చల్ ట్రాఫిక్ పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. పోలీసులు ఆ వాహనంపై ఉన్న బోర్డును నంబర్ ప్లేట్ నుంచి తొలగించారు.
Also Read: పరగడుపున తులసి టీ.. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి దివ్యౌషధం ఇదే!
ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ మధుసూదన్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరికీ సమానంగా వర్తిస్తాయని స్పష్టం చేశారు. “నియమాలకు ఎవరూ అతీతులు కారు” అని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా, కొంతమంది బుల్లెట్ వాహనాల్లో అధిక శబ్దం చేసే సైలెన్సర్లను ఉపయోగిస్తున్నారని గుర్తించి, అలాంటి వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు. అనధికారికంగా సైరన్లు అమర్చిన వాహనాలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని, వాటిని వెంటనే తొలగించాలని హెచ్చరించారు.
Also Read: కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. 2000 కార్లతో భారీ ర్యాలీ..!